News August 26, 2024

రూ.30వేల స్పీకర్స్ బుక్ చేస్తే..!

image

FLIPKARTలో జరిగిన మోసాన్ని ఓ నెటిజన్ Xలో పంచుకున్నారు. నిఖిల్ అనే వ్యక్తి రూ.30వేలు విలువ చేసే SONOS స్పీకర్స్ బుక్ చేస్తే MI కంపెనీకి చెందిన రూ.2400ల స్పీకర్ డెలివరీ చేశారు. దీనిపై పలుమార్లు ఫ్లిప్‌కార్ట్‌కు ఫిర్యాదు చేసినా రెస్పాండ్ కాలేదని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు ఫ్లిప్‌కార్ట్ స్పందించి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చింది. అయితే, ఇలాంటిదే తమకూ జరిగిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Similar News

News December 6, 2025

ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో భారీగా ఉద్యోగాలు

image

ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో 300 AO పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టును బట్టి డిగ్రీ/PG, MA(ఇంగ్లిష్, హిందీ) ఉత్తీర్ణులైన వారు ఈ నెల 15 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 21-30ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: orientalinsurance.org.in/ * మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

News December 6, 2025

APPLY NOW: ECHSలో ఉద్యోగాలు

image

విశాఖపట్నంలోని <>ECHS<<>>లో 14పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 12వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, బీఫార్మసీ, డిప్లొమా, ఎనిమిదో తరగతి చదివిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. డ్రైవర్ పోస్టుకు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. వెబ్‌సైట్:https://www.echs.gov.in

News December 6, 2025

పాక్, అఫ్గాన్ సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తతలు

image

పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. సరిహద్దుల్లో నిన్న రాత్రి పెద్ద ఎత్తున కాల్పులు చోటుచేసుకున్నాయి. స్పిన్ బోల్డక్‌ జిల్లాలో పాక్ దళాలు దాడులు ప్రారంభించాయని అఫ్గాన్ చెప్పింది. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకున్నా చమన్ సరిహద్దులో అఫ్గాన్ కాల్పులు జరిపిందని పాక్ ఆరోపించింది. 2 దేశాల మధ్య శాంతి చర్చలు పురోగతి లేకుండా ముగిసిన నేపథ్యంలో ఈ ఘటనలు జరగడం గమనార్హం.