News April 28, 2024

శ్రీరాముడిని అడిగితే బండి సంజయ్‌కి ఓటేయొద్దంటాడు: KTR

image

TG: BJP MP బండి సంజయ్‌పై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR విమర్శలు గుప్పించారు. కరీంనగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన KTR.. రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ పరస్పర అవగాహనతో ఉన్నారని ఆరోపించారు. బండికి జైశ్రీరామ్ అనడం ఒక్కటే తెలుసని, ఒకవేళ శ్రీరాముడిని అడిగితే ఆయన కూడా బండి సంజయ్‌కు ఓటు వేయవద్దని చెబుతాడని ఎద్దేవా చేశారు.

Similar News

News October 31, 2025

TG SET దరఖాస్తు గడువు పొడిగింపు

image

తెలంగాణలో అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ లెక్చరర్‌షిప్‌ అర్హత కోసం నిర్వహించే TG SET-2025 దరఖాస్తు గడువును పొడిగించారు. పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు నవంబర్ 6వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తులో తప్పుల సవరణకు నవంబర్ 26 నుంచి 28 వరకు అవకాశం ఇస్తారు. డిసెంబర్ 3న హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ రెండో వారంలో పరీక్ష నిర్వహిస్తారు. వెబ్‌సైట్: http://telanganaset.org/

News October 31, 2025

అమరావతి, గన్నవరంలో మెగా రైలు టెర్మినళ్లు!

image

AP: అమరావతి, గన్నవరంలో మెగా టెర్మినళ్లు నిర్మించేందుకు రైల్వేశాఖ సిద్ధమవుతోంది. అమరావతిలో 8 రైల్వే లైన్లు ఏర్పాటు చేస్తారు. ఇక్కడే ట్రైన్ల హాల్టింగ్ ఉంటుంది. భవిష్యత్తులో 120 రైళ్లు రాకపోకలు సాగించేలా దీన్ని అభివృద్ధి చేస్తారు. దీనికోసం 300 ఎకరాల అవసరముంది. అటు గన్నవరంలో ప్రస్తుతం 3 ప్లాట్‌ఫామ్స్ ఉండగా విజయవాడకు ప్రత్యామ్నాయంగా 10 లైన్లు ఏర్పాటు చేస్తారు. దీనికి 143 ఎకరాలు కావాలి.

News October 31, 2025

మావోయిస్టు డంపుల్లో 400 కిలోల గోల్డ్?

image

మావోయిస్టులు లొంగిపోతున్న నేపథ్యంలో వాళ్లు సేకరించిన పార్టీ ఫండ్ ఏమైందన్న దానిపై నిఘా వర్గాలు దృష్టి సారించాయి. నిధుల సేకరణకు వారికి విస్తృత నెట్వర్క్ ఉన్నట్లు NIA గుర్తించింది. ఆ ఫండ్‌ను కొవిడ్ టైమ్‌లో బంగారంగా మార్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. పార్టీ సానుభూతిపరుల పేర్లతోనూ డొల్ల కంపెనీలు పెట్టి రూ.కోట్లు మళ్లిస్తున్నారని, వారి వద్ద రూ.400 కోట్ల నిధులు, 400 KGల గోల్డ్ ఉండొచ్చని అనుమానిస్తోంది.