News August 14, 2025

అలాగైతే భారత్‌పై మరింత టారిఫ్స్: US హెచ్చరిక

image

భారత్‌పై టారిఫ్స్‌ను US మరింత పెంచవచ్చని ఆ దేశ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ హెచ్చరించారు. అలస్కాలో శుక్రవారం జరిగే ట్రంప్-పుతిన్ భేటీ రిజల్ట్‌పై ఇది ఆధారపడి ఉంటుందన్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు రష్యా అంగీకరిస్తే టారిఫ్స్ పెంపు ఉండకపోవచ్చని, లేదంటే సుంకాలు పెంపు తప్పదన్నారు. రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటోందని ఇప్పటికే INDపై US 25% అదనపు టారిఫ్స్ విధించిన సంగతి తెలిసిందే.

Similar News

News August 15, 2025

శనివారం వరకు వేటకు వెళ్లరాదు: APSDMA

image

AP: బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకుని ఉన్న అల్పపీడనం రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయవ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని APSDMA తెలిపింది. దీంతో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. మత్స్యకారులు శనివారం వరకు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. అటు కృష్ణానది వరద ప్రవాహం ఎగువ ప్రాజెక్టులలో స్వల్పంగా తగ్గుముఖం పట్టిందని వివరించింది.

News August 15, 2025

పులివెందులలో వైసీపీకి 8% ఓట్లా?: రోజా

image

AP: గత ఎన్నికల్లో పులివెందుల పరిధిలో YCP 64% ఓట్లు సాధించిందని, ఇప్పుడు 8.95% ఓట్లు రావడమేంటని ఆ పార్టీ నేత రోజా ప్రశ్నించారు. గత ఎన్నికల్లో 24% ఓట్లు వచ్చిన TDPకి ఇప్పుడు 88% ఓట్లు రావడమేంటని మండిపడ్డారు. ‘ఐదుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులకు 0, 1, 2, 3, 4 ఓట్లు రావడం ఏమిటో? పోటీలో ఉన్న అభ్యర్థికి వారి కుటుంబసభ్యులు అయినా ఓటు వేయరా? ఈ ఫలితాలను మనం నమ్మాలా?’ అంటూ ఆమె సందేహం వ్యక్తం చేశారు.

News August 15, 2025

రానున్న 2-3గంటల్లో ఈ జిల్లాల్లో వర్షం

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 2-3గంటల్లో వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. మేడ్చల్, మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో మోస్తరు వర్షం కురుస్తుందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, భద్రాద్రి, జనగామ, ఖమ్మం, మెదక్, మహబూబాబాద్, ములుగు, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్, యాదాద్రి తదితర జిల్లాల్లో వర్షాలు పడతాయని అంచనా వేసింది. గంటకు 40కి.మీ. వేగంతో గాలులు వీస్తాయంది.