News January 2, 2025
అదే జరిగితే NDA బలం 301కి జంప్

మహారాష్ట్ర రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి! చీలిపోయిన NCPని మళ్లీ ఒక్కటి చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇదే జరిగితే లోక్సభలో NDAకు కొత్తబలం రావడం ఖాయం. ప్రస్తుతం ఈ కూటమికి 293 ఎంపీలు ఉన్నారు. INDIA కూటమిలోని NCP SPకి 8 మంది సభ్యులున్నారు. NCP కలిస్తే వారంతా అధికార పక్షం వైపు వస్తారు. దీంతో NDA బలం 301కి పెరుగుతుంది. చెరకు రైతుల సమస్యలంటూ ఈ మధ్యే మోదీతో శరద్ పవార్ ప్రత్యేకంగా భేటీ అవ్వడం గమనార్హం.
Similar News
News December 7, 2025
ESIC ఫరీదాబాద్లో ఉద్యోగాలు

ఫరీదాబాద్లోని <
News December 7, 2025
సర్పంచ్గా ఎన్ని స్థానాల్లో పోటీ చేయవచ్చో తెలుసా?

TG: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక అభ్యర్థి ఎన్ని స్థానాల నుంచైనా పోటీ చేయవచ్చు. అన్ని/ఏదో ఒక చోట గెలిస్తే ఒక స్థానాన్ని ఎంచుకుని, మిగతా చోట్ల రాజీనామా చేయాల్సి ఉంటుంది. కానీ సర్పంచ్ ఎన్నికల్లో అలా కుదరదు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఒక వ్యక్తి ఒక స్థానంలో మాత్రమే పోటీ చేయడానికి పర్మిషన్ ఉంది. ఒకటి కంటే ఎక్కువ చోట్ల బరిలోకి దిగితే పోటీ చేసిన అన్ని చోట్లా అనర్హుడిగా ప్రకటిస్తారు.
Share It
News December 7, 2025
15 ఏళ్లు కూటమి ప్రభుత్వమే: లోకేశ్

AP: గుజరాత్, ఒడిశాలో ఒకే ప్రభుత్వం ఉండటం వల్ల అభివృద్ధి జరిగిందని.. రాష్ట్రంలోనూ 15 ఏళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని మంత్రి లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. ‘కలిసికట్టుగా పనిచేస్తామని పవనన్న పదేపదే చెబుతున్నారు. విడాకులు ఉండవు, మిస్ ఫైర్లు ఉండవు, క్రాస్ ఫైర్లు ఉండవు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం’ అని డలాస్ తెలుగు డయాస్పొరా సమావేశంలో లోకేశ్ తెలిపారు.


