News January 2, 2025

అదే జరిగితే NDA బలం 301కి జంప్

image

మహారాష్ట్ర రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి! చీలిపోయిన NCPని మళ్లీ ఒక్కటి చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇదే జరిగితే లోక్‌సభలో NDAకు కొత్తబలం రావడం ఖాయం. ప్రస్తుతం ఈ కూటమికి 293 ఎంపీలు ఉన్నారు. INDIA కూటమిలోని NCP SPకి 8 మంది సభ్యులున్నారు. NCP కలిస్తే వారంతా అధికార పక్షం వైపు వస్తారు. దీంతో NDA బలం 301కి పెరుగుతుంది. చెరకు రైతుల సమస్యలంటూ ఈ మధ్యే మోదీతో శరద్ పవార్ ప్రత్యేకంగా భేటీ అవ్వడం గమనార్హం.

Similar News

News November 19, 2025

రెండేళ్లుగా కూతురిని ఇంట్లోనే బంధించిన తల్లి.. ఎందుకంటే?

image

AP: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందిన బాలిక 9వ తరగతి వరకు చదువుకుంది. రజస్వల అయిన తర్వాత “బయట ప్రపంచం ప్రమాదం” అనే భయంతో రెండేళ్ల పాటు తల్లి భాగ్యలక్ష్మి ఆమెను ఇంటికే పరిమితం చేసింది. భర్త మృతితో ఒంటరిగా మారిన తల్లి తన భయాలను కుమార్తెకు రుద్దింది. అధికారులు జోక్యం చేసుకొని తల్లీకుమార్తెలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అనారోగ్యంతో ఉన్న తల్లిని KGHకు, మౌనికను సంరక్షణ కేంద్రానికి తరలించారు.

News November 19, 2025

రాజమౌళి-మహేశ్‌బాబు ‘వారణాసి’పై వివాదం!

image

రాజమౌళి-మహేశ్‌బాబు ‘వారణాసి’ సినిమాపై వివాదం మొదలైంది. సుబ్బారెడ్డి అనే డైరెక్టర్ ఇదే టైటిల్‌ను రెండేళ్ల క్రితం TFPCలో రిజిస్టర్ చేయించారు. ఆ టైటిల్‌ను SSMB29 టీమ్ ఉపయోగించడంతో ఆయన TFPCలో ఫిర్యాదు చేశారు. అయితే రాజమౌళి తెలుగు మినహా ఇతర భాషల్లో ఈ టైటిల్‌ను రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. అందుకే గ్లింప్స్‌లోనూ మూవీ టైటిల్‌ను తెలుగులో ఇవ్వలేదని సమాచారం. మరి ఈ వివాదం ఎలా ముగుస్తుందో చూడాలి.

News November 19, 2025

ఐబొమ్మతో పైరసీ ఆగిపోతుందా?.. సీవీ ఆనంద్ రిప్లై ఇదే!

image

TG: కొందరిని అరెస్టు చేయగానే సైబర్ క్రైమ్స్ పూర్తిగా ఆగిపోవని హోంశాఖ స్పెషల్ సీఎస్ CV ఆనంద్ అన్నారు. “ఐబొమ్మతో పైరసీ ఆగిపోతుందా?” అంటూ Xలో చేసిన పోస్టుపై ఆయన స్పందించారు. ‘ఒకడు పోతే మరొకడు వస్తాడు. ఈ నేరాలు కొనసాగుతూనే ఉంటాయి. మన చేతిలో ఉంది నివారణ ఒక్కటే. తక్షణమే డబ్బు సంపాదించాలన్న ఆశ తగ్గించుకోవాలి. సైబర్ నేరాలకు ఇదే మూల కారణం. రాజమౌళి చెప్పినట్లు జీవితంలో ఏదీ ఫ్రీగా రాదు’ అని పేర్కొన్నారు.