News January 2, 2025

అదే జరిగితే NDA బలం 301కి జంప్

image

మహారాష్ట్ర రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి! చీలిపోయిన NCPని మళ్లీ ఒక్కటి చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇదే జరిగితే లోక్‌సభలో NDAకు కొత్తబలం రావడం ఖాయం. ప్రస్తుతం ఈ కూటమికి 293 ఎంపీలు ఉన్నారు. INDIA కూటమిలోని NCP SPకి 8 మంది సభ్యులున్నారు. NCP కలిస్తే వారంతా అధికార పక్షం వైపు వస్తారు. దీంతో NDA బలం 301కి పెరుగుతుంది. చెరకు రైతుల సమస్యలంటూ ఈ మధ్యే మోదీతో శరద్ పవార్ ప్రత్యేకంగా భేటీ అవ్వడం గమనార్హం.

Similar News

News January 18, 2025

నిరాశపరిచిన సింధు

image

ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సింధు పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో ఇండోనేషియా ప్లేయర్ గ్రెగోరియా మారస్కా 9-21, 21-19, 17-21 పాయింట్ల తేడాతో సింధును ఓడించారు. తొలి రౌండ్‌లో పూర్తిగా తేలిపోయిన ఈ తెలుగు షట్లర్ రెండో రౌండ్‌లో పుంజుకున్నట్లు కనిపించినా మూడో రౌండ్లో నిరాశపరిచారు. మరోవైపు మెన్స్ డబుల్స్ జోడీ రంకి రెడ్డి, చిరాగ్ శెట్టి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.

News January 18, 2025

ఈరోజు నమాజ్ వేళలు

image

✒ తేది: జనవరి 18, శనివారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.34 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.50 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.27 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.28 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.04 గంటలకు
✒ ఇష: రాత్రి 7.20 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News January 18, 2025

విడాకుల కేసులో సాక్ష్యంగా దంపతుల వాయిస్ రికార్డింగ్స్.. కోర్టు ఏమందంటే?

image

విడాకుల కేసు విచారణలో చట్టబద్ధత, నైతికతపై సుప్రీంకోర్టులో కీలక చర్చ జరిగింది. భార్యతో జరిగిన సంభాషణలను భర్త సాక్ష్యంగా ప్రవేశపెట్టడంపై జస్టిస్ నాగరత్న అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ఇన్నేళ్లుగా భార్య మాటల్ని రికార్డ్ చేసే భర్త ఎవరుంటారు? ఈ కేసులో ఆర్టికల్-21 కింద గోప్యతా హక్కు, ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్-122 వర్తిస్తుందా లేదా అనేది పరిశీలిస్తాం’ అని పేర్కొన్నారు. తదుపరి విచారణను FEB 18కి వాయిదా వేశారు.