News February 9, 2025
జైలుకెళ్లొస్తే సీఎం.. బ్రేక్ అయిన సెంటిమెంట్

జగన్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, హేమంత్ సోరెన్ జైలుకెళ్లొచ్చారు. ముఖ్యమంత్రులయ్యారు. దీంతో జైలుకెళ్లి తిరిగిరాగానే సీఎం అయిపోవడం ఖాయం అన్న ఓ సెంటిమెంట్ నెలకొంది. కానీ లిక్కర్ స్కామ్లో అరెస్టైన మాజీ సీఎం కేజ్రీవాల్ మాత్రం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారు. జైలుకెళ్తే సీఎం అన్న సెంటిమెంట్ ఢిల్లీ ఎన్నికల్లో బ్రేక్ అయిందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
Similar News
News November 24, 2025
పార్వతీపురం: ఈ మండలాల్లో రిపోర్టర్లు కావలెను..!

పార్వతీపురం మన్యం జిల్లాలో వీరఘట్టం, గుమ్మలక్ష్మీపురం, బలిజిపేట, పార్వతీపురం, గరుగుబిల్లి మండలాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఇక్కడ<
News November 24, 2025
టమాటా కేజీ రూ.80!

TG: నిన్న, మొన్నటి వరకు కేజీ రూ.20-40కే లభించిన టమాటా ఇప్పుడు కొండెక్కింది. ప్రస్తుతం కిలో రూ.60 నుంచి రూ.80 వరకు పలుకుతోంది. దీంతో మార్కెట్లలో టమాట రేటు చూసి సామాన్యులు నోరెళ్లబెడుతున్నారు. కొన్ని మార్కెట్లలో అయితే టమాటానే దొరకడం లేదు. ధర వెచ్చించలేక వ్యాపారులు కొనుగోలు చేయడంలేదు. ఇటీవల మొంథా తుఫాన్ ప్రభావంతో టమాట పంటలు తీవ్రంగా దెబ్బ తినడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు తెలిపారు.
News November 24, 2025
తమిళనాడుకు భారీ వర్ష సూచన.. విద్యాసంస్థలకు సెలవులు

తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తాయని IMD హెచ్చరించడంతో 18 జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సోమవారం సెలవులు ప్రకటించారు. ఒకేసారి 2 సైక్లోనిక్ తుఫానులు రావడంతో తమిళనాడులో భారీ వర్షాలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే తెంకాసి, తిరునల్వేలి, తూత్తుకుడి సహా పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి.


