News March 31, 2024
అధికారం లేకపోతే క్షణం ఉండలేకపోతున్నారు
దేశవ్యాప్తంగా రాజకీయ వలసలు పెరిగిపోతున్నాయి. ఎన్నికల్లో తాము గెలిచి, పార్టీ ఓడితే వెంటనే అధికార పార్టీలోకి జంప్ అవుతున్నారు. అన్ని చోట్లా ఇదే తంతు. ఒక పార్టీని మించి మరో పార్టీ వలసలను ప్రోత్సహిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో అభ్యర్థి గెలుపు కోసం కృషి చేసిన సొంత క్యాడర్ను నట్టేట ముంచి నాయకులు స్వలాభం చూసుకుంటున్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం ఉన్నా.. అది అధికార పార్టీకి చుట్టంగా మారిందనే విమర్శలున్నాయి.
Similar News
News October 6, 2024
నేడు లలితా త్రిపుర సుందరీ దేవిగా దుర్గమ్మ
నేడు విజయవాడ కనక దుర్గమ్మ శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమివ్వనుంది. త్రిపురత్రయంలో రెండో శక్తి స్వరూపిణి ఈ అమ్మవారు. తల్లిని కొలిస్తే కష్టాలు తొలిగి, ఐశ్వర్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. మాత అనుగ్రహం పొందేందుకు ‘ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రేనమ:’ అనే మంత్రాన్ని జపించాలి. అమ్మవారికి పులిహోర నైవేద్యంగా సమర్పించాలని పండితులు చెబుతున్నారు.
News October 6, 2024
తొలి టీ20 నెగ్గేదెవరో?
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ ఆడేందుకు భారత్ సిద్ధమైంది. నేడు గ్వాలియర్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. సూర్య కుమార్ నాయకత్వంలోని కుర్రాళ్లు బంగ్లా జట్టుపై ఎలాంటి ప్రదర్శన చేస్తారో అని ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య 14 టీ20లు జరగ్గా భారత్ 13 విజయాలు సొంతం చేసుకుంది. బంగ్లాదేశ్ ఒక మ్యాచులో గెలుపొందింది. కాగా గ్వాలియర్లో 14 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ జరగనుండటం గమనార్హం.
News October 6, 2024
నేటి నుంచి బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్లు
TG: నేటి నుంచి బీఎస్సీ నర్సింగ్ 2024-25 అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 14 వరకు ఆన్లైన్లో <