News March 30, 2024
ఇలా జరిగితే మీ ఫోన్ ట్యాప్ అయినట్లే!
1. ఫోన్ కాల్లో అసాధారణ శబ్దాలు రావడం
2. కెమెరా, మైక్రోఫోన్ వాటంతటవే ఆన్ అవ్వడం
3. బ్యాటరీ త్వరగా తగ్గిపోవడం
4. ఫోన్ ఉపయోగించనప్పటికీ యాక్టివిటీని చూపించడం.
5. ఫోన్లోని వెబ్సైట్స్ భిన్నంగా కనిపించడం.
6. వాడకపోయినా మొబైల్ బ్యాటరీ హీట్ ఎక్కడం
7. మీకు విచిత్రమైన మెసేజ్లు రావడం
8. స్విచ్ ఆఫ్ చేసేందుకు ప్రయత్నిస్తే ఎక్కువ సమయం తీసుకోవడం
Similar News
News January 23, 2025
శ్రీలంకపై భారత్ విజయం
అండర్-19 మహిళల వరల్డ్ కప్లో భారత జట్టు వరుసగా మూడో విజయం నమోదు చేసింది. శ్రీలంకతో జరిగిన మ్యాచులో 60 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్.. త్రిష(49) రాణించడంతో 118 పరుగులు చేసింది. ఛేదనలో శ్రీలంక 9 వికెట్లు కోల్పోయి 58 పరుగులే చేసింది. భారత బౌలర్లలో షబ్నాం, జోషిత, పరుణిక చెరో రెండు, ఆయూషి, వైష్ణవి తలో వికెట్ తీశారు.
News January 23, 2025
₹2లక్షల కోట్లు.. కేంద్రానికి త్వరలో RBI బొనాంజా!
కేంద్ర ప్రభుత్వానికి RBI బంపర్ బొనాంజా ఇవ్వనుంది. అతి త్వరలోనే రూ.1.5-2 లక్షల కోట్ల వరకు బదిలీ చేయనుందని తెలిసింది. డాలర్ల విక్రయం, పెట్టుబడులు, కరెన్సీ ప్రింటింగ్ ఫీజు రూపంలో వచ్చిన ఆదాయాన్ని సంస్థ ఏటా కేంద్రానికి డివిడెండ్ రూపంలో చెల్లిస్తుంది. క్రితంసారి రూ.2.10లక్షల కోట్లు ఇచ్చింది. ఈసారి అంతకన్నా ఎక్కువే ఇవ్వొచ్చని సమాచారం. డాలర్ల విక్రయంతో RBIకి రూ.1.5 లక్షల కోట్ల ఆదాయం వచ్చినట్టు అంచనా.
News January 23, 2025
మహా కుంభమేళా.. 10 కోట్ల మంది పుణ్యస్నానాలు
ప్రయాగ్రాజ్ (UP) మహా కుంభమేళా రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు త్రివేణి సంగమంలో 10 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. మొత్తం 40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.