News February 6, 2025
పాక్పై ఓడితే గుచ్చి గుచ్చి అడుగుతారు: రవి శాస్త్రి
భారత్-పాక్ మ్యాచ్ ప్రత్యేకమేమీ కాదని, అన్ని మ్యాచుల్లాగే దాన్నీ పరిగణిస్తామన్న కోచ్ గంభీర్ వ్యాఖ్యలపై మాజీ కోచ్ రవిశాస్త్రి ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘కోచ్గా ఉన్నప్పుడు నేనూ మీడియాకు ఇదే మాట చెప్పేవాడిని. కానీ నిజమేంటంటే పాక్పై గెలవడం చాలా కీలకం. ఆ జట్టుపై ఎన్ని మ్యాచులు గెలిచినా ఒక్క మ్యాచ్ ఓడితే చాలు పాతవన్నీ మర్చిపోయి ఓటమి గురించే అందరూ గుచ్చి గుచ్చి అడుగుతారు’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News February 6, 2025
విజయసాయి రెడ్డి రాజీనామాపై తొలిసారి స్పందించిన జగన్
AP: విజయసాయి రెడ్డి రాజీనామాపై YS జగన్ తొలిసారి స్పందించారు. ‘మాకు 11 మంది రాజ్యసభ ఎంపీలుంటే సాయిరెడ్డితో కలిపి ఇప్పటివరకు నలుగురు వెళ్లిపోయారు. అయినా YCPకి ఏమీ కాదు. రాజకీయాల్లో క్యారెక్టర్ ముఖ్యం. అది సాయిరెడ్డికైనా, ఇప్పటివరకు పోయినవారికైనా, ఇంకా ఒకడో, ఇద్దరో వెళ్లేవారికైనా అదే వర్తిస్తుంది. క్యారెక్టర్ను బట్టే ఉంటుంది. YCP కేవలం దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతోనే నడుస్తుంది’ అని స్పష్టం చేశారు.
News February 6, 2025
రేపు ‘జాక్’ టీజర్
డీజే టిల్లూతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో సిద్ధూ జొన్నలగడ్డ ‘జాక్’ సిినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్ర టీజర్ రేపు ఉదయం 11.07 గంటలకు విడుదల కానుంది. సిద్ధూ సరసన బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య నటిస్తున్నారు. ఈ విషయాన్ని మూవీ యూనిట్ ప్రకటించింది. కాగా ఈ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ కానున్నట్లు ప్రకటించింది.
News February 6, 2025
నేషనలిజం అనుసరించొద్దు.. మీ కామెంట్!
ఇంటర్ కనెక్టయిన ఈ ప్రపంచంలో నేషనలిజాన్ని అనుసరించడం సరికాదన్న ఇన్ఫోసిస్ నారాయణ <<15376856>>మూర్తి<<>> వ్యాఖ్యలపై సోషల్మీడియాలో చర్చ జరుగుతోంది. దేశభక్తి కోసం జాతీయవాదాన్ని విడిచిపెట్టాలనడం సరికాదని కొందరు అంటున్నారు. అసలు ఒక జాతిగా నిలబడని దేశం తన సొంత అస్థిత్వాన్ని కోల్పోతుందన్న మహనీయులు మాటలను గుర్తుచేస్తున్నారు. దేశభక్తికి ప్రధానమైనదే జాతీయవాదమని చెప్తున్నారు. మరికొందరు ఆయనకు మద్దతిస్తున్నారు. మీరేమంటారు?