News January 4, 2025

200+ టార్గెట్ నిర్దేశిస్తే భారత్‌దే విజయం!

image

సిడ్నీ టెస్టులో 2వ ఇన్నింగ్స్ ఆడుతున్న IND 145 రన్స్ లీడ్‌లో ఉంది. AUSకు 200+ టార్గెట్ నిర్దేశిస్తే భారత్‌కు గెలిచే అవకాశాలు ఎక్కువున్నాయి. 40 ఏళ్లలో సిడ్నీలో 200+ పరుగుల లక్ష్యాన్ని 2 సార్లే ఛేదించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 6 వికెట్లు కోల్పోయినా క్రీజులో జడేజా, సుందర్ ఉండటంతో లీడ్ 200 దాటే అవకాశాలున్నాయి. తొలి సెషన్లో వికెట్ పడకుండా కాపాడుకుంటే ఆసీస్ ముందు భారీ లక్ష్యం ఉంచవచ్చు.

Similar News

News January 16, 2025

మన స్టార్ క్రికెటర్లు చివరిగా రంజీలు ఎప్పుడు ఆడారంటే?

image

జూనియర్, సీనియర్ తేడా లేకుండా క్రికెటర్లందరూ దేశవాళీ క్రికెట్ ఆడాలని BCCI స్పష్టం చేసింది. దీంతో కొందరు రంజీలకు సిద్ధమవగా, మరికొందరు ఇంకా స్పందించలేదు. ఈ క్రమంలో మన స్టార్ క్రికెటర్లు చివరిసారిగా రంజీ మ్యాచ్‌లు ఎప్పుడు ఆడారో తెలుసుకుందాం. కోహ్లీ(DEL)-2012, రోహిత్(MUM)-2015, బుమ్రా(GUJ)-2017, పంత్(DEL)-2018, రాహుల్(KAR)-2020, జడేజా(SAU)-2023.

News January 16, 2025

నా నిజాయితీని నిరూపించుకుంటా: KTR

image

TG: ACB, ED ఒకే రకమైన ప్రశ్నలు అడిగాయని కేటీఆర్ చెప్పారు. ఈడీ విచారణ తర్వాత మాట్లాడుతూ ‘ఎన్నిసార్లు పిలిచినా వస్తా. ఎన్ని ప్రశ్నలు అడిగినా చెబుతా. విచారణకు సహకరిస్తా. రాజ్యాంగాన్ని, కోర్టులను గౌరవించే వ్యక్తిగా నా నిజాయితీని నిరూపించుకుంటా అని వారితో చెప్పా. అయితే విచారణకు ₹5-10 కోట్లు ఖర్చు పెట్టడం బాధగా ఉంది. ఈ మొత్తంతో 2,500 మందికి పెన్షన్లు, 500 మందికి రుణమాఫీ చేయొచ్చు’ అని చెప్పారు.

News January 16, 2025

సైఫ్‌ను రూ.కోటి డిమాండ్ చేసిన దుండగుడు!

image

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు ఇంట్లోకి చొరబడి దాడి చేసే ముందు సైఫ్‌ను రూ.కోటి డిమాండ్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీనికి ఒప్పుకోకపోవడంతో అగంతకుడు దాడి చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటకొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సైఫ్ ఆరోగ్యం నిలకడగా ఉంది.