News February 16, 2025

100 లేదా 112కు కాల్ చేస్తే నిమిషాల్లో కాపాడతాం: డీజీపీ గుప్తా

image

AP: నేరగాళ్ల నుంచి ఏదైనా ముప్పు వాటిల్లితే వెంటనే 100 లేదా 112కు కాల్ చేయాలని DGP హరీశ్ గుప్తా తెలిపారు. నిమిషాల్లోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కాపాడతారని ఆయన చెప్పారు. ‘నేరాలకు పాల్పడితే ఎవరైనా ఉపేక్షించేది లేదు. మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రతకు కట్టుబడి ఉన్నాం. అలాగే పిల్లలు ఏంచేస్తున్నారో తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టాలి. నేరాలను అరికట్టడంలో సమాజం బాధ్యత తీసుకోవాలి’ అని పేర్కొన్నారు.

Similar News

News December 16, 2025

లిక్కర్ అమ్మకాలకు డిసెంబర్ కిక్కు

image

TG: మద్యం అమ్మకాల ఆదాయం ఈ నెలలో భారీగా పెరగనుంది. స్థానిక ఎన్నికలతో తొలి 2 వారాల్లోనే ₹2వేల కోట్లు వచ్చాయి. చలి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల లిక్కర్‌కు డిమాండ్ పెరిగింది. అటు క్రిస్మస్ ఫెస్టివల్, నూతన సంవత్సర వేడుకలూ ఉండడంతో అమ్మకాలు పెరగనున్నాయి. నెలాఖరుకల్లా మరో ₹2వేల కోట్లు సమకూరి మొత్తం ఆదాయం ₹4వేల కోట్లకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది DECలో ₹3,700 కోట్లు వచ్చాయి.

News December 16, 2025

మహిళలూ.. మీరూ షిఫ్టుల్లో పని చేస్తున్నారా?

image

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగాలకు స్త్రీ పురుష భేదం లేదు. ఉన్నతస్థానాలకు చేరాలంటే అన్ని షిఫ్టుల్లోనూ పనిచేయాల్సి ఉంటుంది. మహిళలకు ఉద్యోగంతోపాటు ఇంట్లో పనులు, పిల్లల బాధ్యతలూ ఉంటాయి. కాబట్టి వీటన్నింటినీ సమన్వయం చేసుకోవడం ముఖ్యం. రోజులో ఏదోక సమయంలో కుటుంబసభ్యులతో గడిపేందుకు ప్రయత్నించాలి. పోషకాహారం తీసుకోవాలి. షిఫ్టుని బట్టి సరిపడా నిద్ర ఉండేలా జాగ్రత్త పడాలి. వ్యాయామానికి కాస్త సమయం కేటాయించాలి.

News December 16, 2025

స్పెషల్ రీఛార్జ్.. ఫోన్ పోతే రూ.25వేల ఇన్సూరెన్స్

image

వినియోగదారులను ఆకర్షించేందుకు వొడాఫోన్ ఐడియా (Vi) వినూత్న ప్లాన్లను ప్రకటించింది. ఈ ప్రత్యేక రీఛార్జ్ ప్యాక్‌ల ద్వారా మొబైల్ పోగొట్టుకున్నా లేదా పాడైపోయినా ₹25,000 వరకు బీమా పొందే అవకాశం ఉంటుంది. ₹61 రీఛార్జ్‌తో 30రోజులు బీమాతో పాటు 2GB(15D), 6 నెలల కోసం ₹201, ఏడాది పాటు ఇన్సూరెన్స్ పొందాలంటే ₹251తో రీఛార్జ్ చేసుకోవాలి. ఎయిర్‌టెల్, జియో కూడా ఇలాంటి ప్లాన్ తీసుకురావాలనే డిమాండ్ వినిపిస్తోంది.