News February 16, 2025
100 లేదా 112కు కాల్ చేస్తే నిమిషాల్లో కాపాడతాం: డీజీపీ గుప్తా

AP: నేరగాళ్ల నుంచి ఏదైనా ముప్పు వాటిల్లితే వెంటనే 100 లేదా 112కు కాల్ చేయాలని DGP హరీశ్ గుప్తా తెలిపారు. నిమిషాల్లోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కాపాడతారని ఆయన చెప్పారు. ‘నేరాలకు పాల్పడితే ఎవరైనా ఉపేక్షించేది లేదు. మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రతకు కట్టుబడి ఉన్నాం. అలాగే పిల్లలు ఏంచేస్తున్నారో తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టాలి. నేరాలను అరికట్టడంలో సమాజం బాధ్యత తీసుకోవాలి’ అని పేర్కొన్నారు.
Similar News
News December 26, 2025
అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేయండి: కేంద్ర మంత్రికి CBN వినతి

AP: వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను CM CBN కోరారు. పంచసూత్రాల ప్రణాళిక అమలుతో వ్యవసాయ అనుబంధ రంగాల్లో 10.70% అభివృద్ధి సాధించామన్నారు. ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని, రూ.2,585 కోట్ల అంచనాతో డీపీఆర్ను వ్యవసాయ పరిశోధన, విద్య విభాగానికి ఇప్పటికే సమర్పించినట్టు వినతిపత్రంలో పేర్కొన్నారు.
News December 26, 2025
రెడ్ కలర్ చూస్తే ఎద్దులు దాడి చేస్తాయా! నిజమేంటి?

రెడ్ కలర్ ఎద్దులకు నచ్చదని, దాడి చేస్తాయనేది అపోహ మాత్రమే. చాలా పశువుల్లాగే ఎద్దులకు కూడా రెడ్ కలర్ను గుర్తించే రెటీనా సెల్స్ ఉండవు. ఎద్దులు డైక్రోమాట్స్ (2కలర్ రిసెప్టర్లు) కావడంతో ఎల్లో, బ్లూ, గ్రీన్, వయొలెట్ రంగులను గుర్తించగలవు. వాటికి ఎరుపు రంగు గ్రేయిష్-బ్రౌన్ లేదా ఎల్లోయిష్-గ్రేలా కనిపిస్తుంది. వేగమైన కదలికల కారణంగా దాడికి దిగుతాయి. తెలుపు, నీలం రంగు క్లాత్స్ కదిలించినా దాడి చేస్తాయి.
News December 26, 2025
డిసెంబర్ 26: చరిత్రలో ఈరోజు

✒ 1899: స్వాతంత్ర్య సమరయోధుడు ఉద్దమ్ సింగ్ జననం
✒ 1893: చైనాలో ప్రముఖ కమ్యూనిస్టు నేత మావో జెడాంగ్ జననం
✒ 1946: దర్శకుడు బి.నరసింగరావు జననం
✒ 1981: మహానటి సావిత్రి మరణం(ఫొటోలో)
✒ 1988: కాపు నేత వంగవీటి మోహనరంగా మరణం
✒ 2004: పలు దేశాల్లో విధ్వంసం సృష్టించిన సునామీ. దాదాపు 2,75,000 మంది మృతి


