News January 3, 2025

చలికాలంలో నెయ్యి వేసుకొని టీ తాగితే..

image

గరమ్ గరమ్ ఛాయ్ అంటే ఇష్టపడనిదెవరు! చలికాలంలో దేశీనెయ్యి వేసుకొని టీ తాగితే బెనిఫిట్స్ ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. ఆయుర్వేదం ప్రకారం ఇందులోని మేధ్యరస గుణాలు కెఫిన్‌తో కలిసి మెదడును చైతన్యవంతం చేస్తాయి. మెమరీ పవర్‌ను పెంచుతాయి. ఇక యాంటీఆక్సిడెంట్స్, హెల్తీ ఫ్యాట్స్ మూడ్ స్వింగ్స్ నుంచి రిలీఫ్ ఇస్తాయి. స్ట్రెస్‌, లేజీనెస్, వీక్‌నెస్‌ను తొలగిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా అడ్డుకుంటాయి.

Similar News

News October 20, 2025

దేశ ప్రజలకు రాష్ట్రపతి, పీఎం దీపావళి విషెస్

image

దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం, శ్రేయస్సు, సామరస్యం నింపాలని ఆకాంక్షించారు. నిన్న తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి తెలిసిందే.

News October 20, 2025

దీపావళి రోజున వీటిని చూస్తే అదృష్టమట

image

దీపావళి పర్వదినాన కొన్ని ప్రత్యేక సంకేతాలు అదృష్టాన్ని, లక్ష్మీ అనుగ్రహాన్ని సూచిస్తాయని పండితులు చెబుతున్నారు. మహాలక్ష్మి వాహనమైన గుడ్లగూబను చూస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోయి, సంపద వృద్ధి చెందుతుందని అంటున్నారు. అమ్మవారికి ప్రీతిపాత్రమైన తామర పువ్వును చూస్తే ధనవృద్ధి ఉంటుందంటున్నారు. కాకి కనిపించడం పూర్వీకుల ఆశీస్సులతో సమానమట. వీటితో పాటు ఆవులు, బల్లులను చూడటం కూడా శుభప్రదంగా పరిగణిస్తారు.

News October 20, 2025

కొత్తగా 41 కాలేజీలు.. 10,650 ఎంబీబీఎస్ సీట్లు

image

2025-26 విద్యాసంవత్సరానికిగానూ 10,650 MBBS సీట్లకు NMC ఆమోదం తెలిపింది. దీంతో మొత్తం సీట్ల సంఖ్య 1,37,600కు చేరనుంది. వీటిలో INIకు చెందిన సీట్లూ ఉన్నాయని వెల్లడించింది. దీంతో పాటు 41 నూతన మెడికల్ కాలేజీలకు ఆమోదం తెలపగా మొత్తం విద్యాసంస్థల సంఖ్య 816కు పెరగనుంది. అటు పీజీ సీట్లు 5వేల వరకు పెరిగే ఛాన్స్ ఉందని దీంతో దేశవ్యాప్తంగా వీటి సంఖ్య 67వేలకు చేరే అవకాశం ఉంది.