News March 29, 2025
మీరు గ్యారంటీలు ఇస్తే.. మేం నిధులివ్వాలా?: కిషన్ రెడ్డి

TG: రాష్ట్రాలు గ్యారంటీలు ఇచ్చి, నిధులు కేంద్రం ఇవ్వాలంటే ఎలా? అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ 10 ఏళ్లలో అనేక రహదారులు ఏర్పడ్డాయని చెప్పారు. ‘మేం ఇచ్చిన హమీల అమలు బాధ్యత మాదే. ఇతర పార్టీల్లో తదుపరి అధ్యక్షుడు ఎవరో చెప్పొచ్చు. BJPలో అలా కాదు. JP నడ్డా తర్వాత అధ్యక్షుడు ఎవరో దేవుడు కూడా చెప్పలేడు. డీలిమిటేషన్ విషయంలో ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదు’ అని ఓ మీడియా కాంక్లేవ్లో తెలిపారు.
Similar News
News December 20, 2025
జూన్ కల్లా ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మారుస్తాం: సీఎం

AP: జనవరి 26 నాటికి రోడ్లపై చెత్త కనిపించకూడదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. జూన్ కల్లా APని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మారుస్తామని ప్రకటించారు. ప్రజల్లోనూ సామాజిక స్పృహ రావాలని, ఇంట్లోని చెత్తను రోడ్లపై వేయొద్దని సూచించారు. అనకాపల్లి(D) తాళ్లపాలెంలో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’లో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో 10L గృహాలు, పట్టణాల్లో 5L ఇళ్లలో కంపోస్టు తయారీ తమ లక్ష్యమన్నారు.
News December 20, 2025
కర్ణాటక CM మార్పు.. సరైన టైంలో హైకమాండ్ని కలుస్తామన్న DK

కర్ణాటకలో CM మార్పు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా Dy CM డీకే శివకుమార్ మాట్లాడుతూ.. పిలుపు వచ్చినపుడు తాను, సీఎం సిద్దరామయ్య హైకమాండ్ని కలుస్తామన్నారు. సరైన సమయంలో పిలుస్తామని పార్టీ పెద్దలు చెప్పినట్లు తెలిపారు. పవర్ షేరింగ్ ఒప్పందమేమీ లేదని.. హైకమాండ్ చెప్పే వరకు తానే సీఎం అని సిద్దరామయ్య శుక్రవారం అనడంతో చర్చ మళ్లీ మొదలైంది. ఈ నేపథ్యంలోనే డీకే తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
News December 20, 2025
BEML 50 పోస్టులకు నోటిఫికేషన్

భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(<


