News March 29, 2025
మీరు గ్యారంటీలు ఇస్తే.. మేం నిధులివ్వాలా?: కిషన్ రెడ్డి

TG: రాష్ట్రాలు గ్యారంటీలు ఇచ్చి, నిధులు కేంద్రం ఇవ్వాలంటే ఎలా? అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ 10 ఏళ్లలో అనేక రహదారులు ఏర్పడ్డాయని చెప్పారు. ‘మేం ఇచ్చిన హమీల అమలు బాధ్యత మాదే. ఇతర పార్టీల్లో తదుపరి అధ్యక్షుడు ఎవరో చెప్పొచ్చు. BJPలో అలా కాదు. JP నడ్డా తర్వాత అధ్యక్షుడు ఎవరో దేవుడు కూడా చెప్పలేడు. డీలిమిటేషన్ విషయంలో ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదు’ అని ఓ మీడియా కాంక్లేవ్లో తెలిపారు.
Similar News
News April 18, 2025
కీవ్లో భారత ఫార్మా గోడౌన్పై దాడి.. ఉక్రెయిన్కు రష్యా కౌంటర్

కీవ్లో APR 12న భారత ఫార్మా గోడౌన్పై దాడి జరగ్గా, దానికి కారణం రష్యా క్షిపణి అని ఉక్రెయిన్ ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై రష్యా తాజాగా స్పందించింది.
ఉక్రెయిన్ క్షిపణుల వల్లే ఇది జరిగి ఉంటుందని కౌంటర్ ఇచ్చింది. ఆ దాడి తాము చేయలేదని భారత్లోని రష్యా ఎంబసీ స్పష్టం చేసింది. నివాస ప్రాంతాల్లో రాకెట్ లాంచర్లు, ఫిరంగులు సహా ఇతర సైనిక పరికరాలను మోహరించడం ఉక్రెయిన్కు పరిపాటిగా మారిందని మండిపడింది.
News April 18, 2025
కాంగ్రెస్ బతుకు అగమ్యగోచరమే: బండి సంజయ్

TG: రాహుల్, సోనియా గాంధీ పేర్లను ED ఛార్జ్షీట్లో చేర్చడంపై HYD ఈడీ ఆఫీస్ వద్ద కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ‘దేశ ప్రజలంతా ఛీత్కరించుకోవడం, దేశాన్ని ఇంకా దోపిడీ చేయలేకపోయామనే నిరాశలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. వివేకం, వ్యక్తిత్వం వదిలేసి PMపై దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. వారి భాష చూస్తే 2029 కాదు, యుగం గడిచినా ఆ పార్టీ బతుకు అగమ్యగోచరమే’ అని ట్వీట్ చేశారు.
News April 18, 2025
అరుదైన ఘనత సాధించిన హెడ్

IPL: వాంఖడేలో MIతో జరుగుతున్న మ్యాచ్లో SRH ఓపెనర్ ట్రావిస్ హెడ్ అరుదైన ఘనత సాధించారు. ఐపీఎల్ చరిత్రలో వేగంగా 1000 రన్స్ పూర్తి చేసిన రెండో ఆటగాడిగా నిలిచారు. మొత్తంగా 575 బంతుల్లో ఈ మైలురాయిని చేరుకున్నారు. ఈ జాబితాలో తొలి స్థానంలో రస్సెల్(545), హెడ్ తర్వాత క్లాసెన్(594), సెహ్వాగ్(604), మ్యాక్స్వెల్(610), యూసుఫ్ పఠాన్(617), నరైన్(617) ఉన్నారు.