News July 20, 2024

ప్రిలిమ్స్ పాసైతే రూ.లక్ష.. అర్హతలు ఇవే

image

*అభ్యర్థులు జనరల్ (EWS)/బీసీ/ఎస్సీ/ఎస్టీలై ఉండాలి.
*తెలంగాణ రాష్ట్ర శాశ్వత నివాసి అయి ఉండాలి.
*యూపీఎస్సీ ప్రిలిమినరీలో పాస్ కావాలి.
*వార్షిక కుటుంబ ఆదాయం రూ.8 లక్షలలోపు మాత్రమే ఉండాలి. ప్రభుత్వ రంగ సంస్థల శాశ్వత ఉద్యోగులు అనర్హులు
*ఒకసారి మాత్రమే ఈ ప్రోత్సాహం అందుతుంది.
>> ఈ పథకానికి తెలంగాణ ప్రభుత్వం ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ అని పేరు పెట్టి ఆర్థిక సాయం అందించనుంది.

Similar News

News December 22, 2025

ఆరావళి పర్వతాలపై కేంద్రం క్లారిటీ

image

ఆరావళి పర్వతాలలో గనుల తవ్వకాల కోసం వాటి నిర్వచనాన్ని మార్చారని వస్తున్న <<18631068>>ఆరోపణల<<>>పై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఆరావళి విస్తీర్ణంలో 90 శాతానికి పైగా రక్షిత ప్రాంతంగానే ఉంటుందని పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ స్పష్టం చేశారు. ఆరావళి పర్వతాల మైనింగ్‌పై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మొత్తం 1.44 లక్షల చ.కి.మీ విస్తీర్ణంలో కేవలం 0.19% పరిధిలోనే తవ్వకాలకు అనుమతి ఇచ్చినట్టు చెప్పారు.

News December 22, 2025

ప్రముఖ హాలీవుడ్ నటుడు జేమ్స్ రాన్సోన్ ఆత్మహత్య

image

హాలీవుడ్ నటుడు జేమ్స్ రాన్సోన్ (46) ఆత్మహత్య చేసుకున్నారు. ‘It: Chapter Two’, ‘The Black Phone’ వంటి చిత్రాలతో పాటు పలు సిరీస్‌ల్లోనూ ఆయన నటించారు. ప్రముఖ టీవీ సిరీస్ ‘The Wire’లో జిగ్గీ సోబోట్కా పాత్రతో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అమెరికాలోని బాల్టిమోర్‌లో జన్మించిన రాన్సోన్ గత కొంతకాలంగా వ్యక్తిగత, మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. వీటి గురించి ఆయనే స్వయంగా పలుమార్లు తెలిపారు.

News December 22, 2025

100% సబ్సిడీతో ఆయిల్‌పామ్ మొక్కలు

image

AP: ఆయిల్‌పామ్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పలు రాయితీలు ఇస్తోంది. 100% సబ్సిడీతో మొక్కలు సరఫరా చేస్తోంది. హెక్టారు(2.47ఎకరాలు)కు దిగుమతి మొక్కలకు ₹29 వేలు, స్వదేశీ మొక్కలకు ₹20 వేలు ఇస్తోంది. బోర్‌వెల్‌కు ₹25 వేలు, మోటారుకు ₹10 వేలు, పంట రక్షణ కోసం వైర్ మెష్ కంపోనెంట్‌ ఏర్పాటుకు ₹20 వేలు అందజేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 24 జిల్లాల్లో 2.49 లక్షల హెక్టార్లలో ఈ పంట సాగు చేస్తున్నారు.