News April 15, 2025
ఇలా పొదుపు చేస్తే.. ఆర్థిక సమస్యలకు చెక్!

ఉద్యోగమైనా, వ్యాపారం అయినా పొదుపు చేయకపోతే అనుకోకుండా వచ్చే ఆర్థిక సమస్యలను ఎదుర్కోలేం. అందుకే నెలనెలా వచ్చే ఆదాయంలో 20 శాతం కచ్చితంగా పొదుపునకు కేటాయించాలి. మిగతా 80 శాతం డబ్బునే ఇతరత్రా ఖర్చులకు వాడాలి. అందులోనూ అనవసరమైన ఖర్చులున్నాయా? అని ప్రతినెలా చెక్ చేస్తూ వాటిని తగ్గించుకోవాలి. హంగులు, ఆర్భాటాలు, కోరికలు తగ్గించుకుంటే భవిష్యత్తులో ఆర్థికపరమైన సమస్యలు దరిచేరవని నిపుణులు చెబుతున్నారు.
Similar News
News April 16, 2025
చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దు.. సుప్రీంకోర్టు సీరియస్

TG: హైదరాబాద్ కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై సీరియస్ అయింది. చెట్లు కొట్టేసే ముందు అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పాలని జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఆదేశించింది. అనుమతులతోనే ఆ భూముల్లో జామాయిల్ తరహా చెట్లు, పొదలు తొలగించామని ప్రభుత్వ తరఫు న్యాయవాది తెలిపారు. చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దని, చెట్ల పునరుద్ధరణపై ప్రణాళికతో రావాలని స్పష్టం చేసింది.
News April 16, 2025
ఔరంగజేబు సమాధిని రక్షించాలంటూ UNOకి లేఖ

MHలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో ఉన్న ఔరంగజేబు సమాధిని రక్షించాలని కోరుతూ మెుఘల్ వారసుడు యాకుబ్ హబీబుద్దీన్ UNOకు లేఖ రాశారు. అసత్య ప్రచారాల వల్ల సమాధిని కూల్చివేయాలంటూ నిరసన ప్రదర్శనలు జరిగాయని లేఖలో తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ చట్టాలను అనుసరించి చారిత్రక కట్టడాలను కాపాడేలా ప్రత్యేక భద్రతను కల్పించాలని కోరారు. కాగా గత నెలలో ఔరంగజేబు సమాధి కేంద్రంగా మత ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే.
News April 16, 2025
పోలీసుల విచారణకు జగన్ హెలికాప్టర్ పైలట్, కో పైలట్

AP: YS జగన్ హెలికాప్టర్ పైలట్ అనిల్, కో పైలట్ శ్రయాజ్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. శ్రీసత్యసాయి(D) సి.కె.పల్లి పీఎస్లో వారి విచారణ జరుగుతోంది. ఈనెల 8న జగన్ చిప్సన్ ఏవియేషన్కు చెందిన హెలికాప్టర్లో పాపిరెడ్డిపల్లికి వచ్చారు. YCP కార్యకర్తలు భారీగా చుట్టుముట్టడంతో హెలికాప్టర్ దెబ్బతింది. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పకుండా పైలట్, కో పైలట్ వెళ్లిపోయారు. దీన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు.