News April 15, 2025

ఇలా పొదుపు చేస్తే.. ఆర్థిక సమస్యలకు చెక్!

image

ఉద్యోగమైనా, వ్యాపారం అయినా పొదుపు చేయకపోతే అనుకోకుండా వచ్చే ఆర్థిక సమస్యలను ఎదుర్కోలేం. అందుకే నెలనెలా వచ్చే ఆదాయంలో 20 శాతం కచ్చితంగా పొదుపునకు కేటాయించాలి. మిగతా 80 శాతం డబ్బునే ఇతరత్రా ఖర్చులకు వాడాలి. అందులోనూ అనవసరమైన ఖర్చులున్నాయా? అని ప్రతినెలా చెక్ చేస్తూ వాటిని తగ్గించుకోవాలి. హంగులు, ఆర్భాటాలు, కోరికలు తగ్గించుకుంటే భవిష్యత్తులో ఆర్థికపరమైన సమస్యలు దరిచేరవని నిపుణులు చెబుతున్నారు.

Similar News

News December 6, 2025

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2047 షెడ్యూల్

image

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్-2047 ఎల్లుండి ప్రారంభం కానుంది. హైదరాబాద్ శివారులోని ఫ్యూచర్ సిటీలో విశాలమైన ప్రాంగణంలో ఈ సదస్సు జరగనుంది. వివిధ దేశాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ నేతలు, దేశంలోని కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, మంత్రులు హాజరవనున్నారు. సమ్మిట్ రెండు రోజుల షెడ్యూల్‌ను ఇక్కడ <>క్లిక్ <<>>చేసి చూడొచ్చు.

News December 6, 2025

సెల్యూట్ డాక్టర్.. 1.2లక్షల మందికి ఉచితంగా..!

image

నిస్సహాయులకు వైద్యం అందని చోట డాక్టర్ సునీల్ కుమార్ హెబ్బీ ఆశాదీపంగా మారారు. పేరు కోసం కాకుండా సేవ చేయడానికి తన కారును ‘సంచార క్లినిక్‌’గా మార్చుకున్నారు. బెంగళూరు వీధుల్లోని పేదలకు ఇంటి వద్దే ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. ఒక రోడ్డు ప్రమాదంతో మొదలైన ఈ గొప్ప ప్రయాణం ఇప్పటికే 1.2 లక్షల మందికిపైగా ప్రాణాలను కాపాడింది. వైద్య పరికరాలతో నిండిన ఆయన కారు ఎంతో మందికి కొత్త జీవితాన్నిస్తోంది.

News December 6, 2025

గ్లోబల్ సమ్మిట్‌కు ప్రత్యేక విమానాలు: భట్టి

image

TG: ఈ నెల 8, 9న ఫ్యూచర్ సిటీలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ సదస్సుకు వచ్చే ప్రముఖుల కోసం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కాగా ఇండిగో విమానాల రద్దు నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో సమ్మిట్‌కు వచ్చే వారు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.