News December 11, 2024
కేజీ గార్బేజ్ తీసుకొస్తే చాలు.. కడుపు నిండా ఫుడ్
ఆకలిగా ఉన్నా డబ్బులు లేవని బాధపడుతున్న వారికి అంబికాపూర్లోని(ఛత్తీస్గఢ్) ‘గార్బేజ్ కేఫ్’ కడుపు నిండా ఆహారం పెడుతోంది. ఈ ప్రత్యేకమైన కేఫ్లో 1 కేజీ ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకొచ్చిన వారికి భోజనాన్ని అందిస్తున్నారు. ఇందులో రోటీలతో పాటు అన్నం, సలాడ్, ఊరగాయలు, పాపడ్ ఉంటాయి. ప్లాస్టిక్ సీసాలు, ఇతర వ్యర్థాలను తీసుకురావాలి. అన్నార్థుల ఆకలి తీర్చడం, కాలుష్యాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.
Similar News
News January 14, 2025
GOOD NEWS: సైనిక్ స్కూళ్లు.. దరఖాస్తు గడువు పొడిగింపు
దేశవ్యాప్తంగా సైనిక్ స్కూళ్లలో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు నిన్నటితో ముగియగా NTA మరో అవకాశం ఇచ్చింది. ఈ నెల 23 వరకు గడువును పొడిగించింది. ఆరో క్లాస్కు అభ్యర్థుల వయసు మార్చి 31, 2025 నాటికి 10-12ఏళ్లు, 9వ క్లాస్కు 13-15ఏళ్లు ఉండాలి. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో ఎగ్జామ్ ఉంటుంది. పూర్తి వివరాల కోసం <
News January 14, 2025
తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ సుజయ్ పాల్
హైకోర్టు సీజేగా జస్టిస్ సుజయ్ పాల్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఇక్కడ సీజేగా ఉన్న జస్టిస్ ఆలోక్ అరాధే బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఇటీవల సీజేల బదిలీలకు సుప్రీం కొలీజియం సిఫార్సు చేసిన విషయం తెలిసిందే.
News January 14, 2025
అధికారుల తీరుపై మంత్రి పొన్నం నిరసన
TG: హన్మకొండ జిల్లా కొత్తకొండ జాతరకు హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన రాగానే అక్కడి ఏర్పాట్లపై భక్తులు ఫిర్యాదు చేశారు. కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని చెప్పారు. అధికారుల తీరుపై కోపంతో మంత్రి వసతి గృహం వద్ద నేలపై కూర్చున్నారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు గర్భగుడిలోకి వెళ్లలేదు. అనంతరం ప్రెస్మీట్లో మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు.