News May 10, 2024
ఈవీఎంలను టచ్ చేస్తే తాట తీస్తా: ఎస్పీ సిద్దార్థ్ కౌశల్

AP: ఎన్నికల్లో అల్లర్లకు పాల్పడే వారిని వదిలిపెట్టబోమని వైఎస్సార్ జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ హెచ్చరించారు. ‘పోలింగ్ రోజు అల్లర్లకు పాల్పడిన వారిని వెంటాడి కొట్టుకుంటూ తీసుకొస్తా. ఈవీఎంలను టచ్ చేస్తే తాట తీస్తా. 20 రోజులు అదే పనిలో ఉంటా. కేసులతో పాటు జిల్లా బహిష్కరణకు కూడా వెనుకాడం. ఎన్నికల ప్రశాంత నిర్వహణకు అందరూ సహకరించాలి’ అని ఎస్పీ పిలుపునిచ్చారు.
Similar News
News December 15, 2025
‘AGRATE’ ఏం చేస్తుంది?

‘AGRATE’ చిన్న రైతులకు నాణ్యమైన విత్తనాలు, డ్రిప్ ఇరిగేషన్, ఆధునిక వ్యవసాయ పరికరాలు, సేంద్రియ ఎరువులను తక్కువ ధరకే అందిస్తోంది. అలాగే కొమ్మలను అంటుకట్టడం, ఎక్కువ పంటల సాగు, స్థిరమైన వ్యవసాయ విధానాలపై రైతులకు ఆధునిక శిక్షణ ఇవ్వడంతో పంట దిగుబడి పెరిగింది. ITC, Godrej, Parle వంటి కంపెనీలతో శుక్లా ఒప్పందం చేసుకోవడంతో రైతుల ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు పెరిగి వారి ఆదాయం గణనీయంగా పెరిగింది.
News December 15, 2025
టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్లో ఉద్యోగాలు

<
News December 15, 2025
టమాటా కాయ ఆకృతి కోల్పోవడానికి కారణం ఏమిటి?

టమాటా కాయలు ఆకృతిని కోల్పోయే సమస్య ఎక్కువగా కాయలో పూత చివరి వైపు కనిపిస్తుంది. పిందె కట్టే దశలో చల్లని వాతావరణం వల్ల కాయ ఆకృతి కోల్పోతుంది. పెద్ద పరిమాణం గల కాయరకాల్లో ఈ సమస్య సాధారణంగా ఉంటుంది. దీని నివారణకు కలుపు మందులు లేదా పెరుగుదలను నియంత్రించే రసాయనాలను పిచికారీ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. టమాట పంటను మురుగు నీరు బయటకు పోయే వసతి లేని నేలల్లో పండించకూడదు.


