News May 10, 2024

ఈవీఎంలను టచ్ చేస్తే తాట తీస్తా: ఎస్పీ సిద్దార్థ్ కౌశల్

image

AP: ఎన్నికల్లో అల్లర్లకు పాల్పడే వారిని వదిలిపెట్టబోమని వైఎస్సార్ జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ హెచ్చరించారు. ‘పోలింగ్ రోజు అల్లర్లకు పాల్పడిన వారిని వెంటాడి కొట్టుకుంటూ తీసుకొస్తా. ఈవీఎంలను టచ్ చేస్తే తాట తీస్తా. 20 రోజులు అదే పనిలో ఉంటా. కేసులతో పాటు జిల్లా బహిష్కరణకు కూడా వెనుకాడం. ఎన్నికల ప్రశాంత నిర్వహణకు అందరూ సహకరించాలి’ అని ఎస్పీ పిలుపునిచ్చారు.

Similar News

News February 8, 2025

తొలిసారి ‘ఆప్‌’కు 48 రోజులే అధికారం

image

మూడో సారి అధికారం చేజిక్కించుకోవడానికి CM పదవికి సైతం దూరంగా ఉంటూ అరవింద్ కేజ్రీవాల్ వ్యూహ‌ప్రతివ్యూహాలు రచించారు. BJPపై ఘాటు విమర్శలు చేస్తూనే హామీలు గుప్పించారు. కాగా, తొలిసారి 2013లో అధికారం చేపట్టిన ఆప్ కాంగ్రెస్ మద్దతుతో కేవలం 48 రోజులే అధికారంలో ఉంది. 2014లో ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించారు. ఆపై 2015 నుంచి రెండు సార్లు విజయం సాధించింది. నాలుగోసారి ఆప్ గెలుస్తుందని అనుకుంటున్నారా?

News February 8, 2025

ప్రైవేట్ వీడియోలపై హీరో నిఖిల్ స్పందన ఇదే

image

మస్తాన్ సాయి <<15351108>>ప్రైవేట్ వీడియోల<<>> వ్యవహారంలో లావణ్య అనే యువతి తన పేరును ప్రస్తావించడంపై హీరో నిఖిల్ స్పందించారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ఆ వీడియోలు కార్తికేయ-2 సక్సెస్ మీట్ తర్వాత జరిగిన డిన్నర్ పార్టీలోనివని చెప్పారు. తన కుటుంబసభ్యులతో ఉన్న దృశ్యాలను తప్పుగా చూపిస్తున్నారని తెలిపారు. వాస్తవం పోలీసులకు కూడా తెలుసని, అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.

News February 8, 2025

శ్రీకాకుళంలోని ఆ 104 గ్రామాల్లో ‘తండేల్’ కథలే!

image

AP: శ్రీకాకుళం (D) K.మత్య్సలేశంకు చెందిన రామారావు, కొందరు జాలర్ల వాస్తవిక జీవితం ఆధారంగా తీసిన మూవీ ‘తండేల్’. అయితే జిల్లాలోని 193KM తీర ప్రాంతంలో ఉన్న 104మత్స్యకార గ్రామాల్లో ఇలాంటి కథలే కన్పిస్తాయి. ఫిషింగ్ హార్బర్లు లేక కొందరు నాటు పడవలపై ప్రమాదకరంగా చేపల వేట చేస్తున్నారు. వేలాదిగా ముంబై, వీరావల్(గుజరాత్) పోర్టులకు వలస వెళ్లి వ్యాపారుల వద్ద పనుల్లో చేరి దాదాపు సముద్రానికే అంకితమవుతున్నారు.

error: Content is protected !!