News September 23, 2024
జనరల్ బోగీలో టికెట్ లేకుండా ప్రయాణిస్తే..?

రైళ్లలో జనరల్ బోగీల్లో టికెట్ ధర తక్కువే అయినప్పటికీ కొందరు నిర్లక్ష్యంతో టికెట్ లేకుండానే ప్రయాణిస్తుంటారు. అలాంటి వారు పట్టుబడితే రూ.250 వరకు జరిమానా ఉంటుంది. దాంతో పాటు అప్పటి వరకు ప్రయాణించిన దూరానికి ఛార్జీని కూడా చెల్లించాలి. చెల్లించకపోతే వారిని రైల్వే పోలీసులకు అప్పగించే హక్కు టీసీకి ఉంటుంది. ఇక ఈ తప్పును పదే పదే చేసేవారికి శిక్షల తీవ్రత కూడా అలాగే పెరుగుతుంటుంది.
Similar News
News November 26, 2025
HOCLలో 72 పోస్టులు.. అప్లై చేశారా?

కేరళలోని హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్ లిమిటెడ్(<
News November 26, 2025
SBI సరికొత్త రికార్డు.. షేర్ వాల్యూ@రూ.999

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు SBI సరికొత్త రికార్డు నమోదుచేసింది. ఇవాళ సంస్థ స్టాక్ దాదాపు 3 శాతం పెరగడంతో విలువ ఆల్టైమ్ హై రూ.999కి చేరింది. స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.1000 కూడా దాటొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా సంస్థ వ్యాపార విలువ రూ.100 లక్షల కోట్లకు చేరినట్లు ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
News November 26, 2025
‘కమ్లా పసంద్’ ఓనర్ కోడలు ఆత్మహత్య

పాపులర్ పాన్ మసాలా కంపెనీ ‘కమ్లా పసంద్’ ఓనర్ కమల్ కిషోర్ కోడలు దీప్తి చౌరాసియా(40) ఆత్మహత్య చేసుకున్నారు. ఢిల్లీ వసంత్ విహార్లోని తన ఫ్లాట్లో ఆమె ఉరి వేసుకొని కనిపించారు. దీప్తి గదిలో పోలీసులు సూసైడ్ లెటర్ను స్వాధీనం చేసుకున్నారు. అందులో భర్త హర్ప్రీత్ చౌరాసియా పేరును రాసినట్లు తెలుస్తోంది. 2010లో దీప్తి-హర్ప్రీత్ వివాహం చేసుకున్నారు. వారికి 14 ఏళ్ల కుమారుడు ఉన్నారు.


