News May 26, 2024
టీ20 వరల్డ్ కప్ గెలిచాకే కేక్ తింటా: రోహిత్ శర్మ

భారత కెప్టెన్ రోహిత్ శర్మ సహా పలువురు ప్లేయర్స్ టీ20 వరల్డ్ కప్ కోసం తాజాగా అమెరికాకు చేరుకున్న సంగతి తెలిసిందే. బయలుదేరే ముందు వారు కేక్ కటింగ్ వేడుక చేసుకున్నారు. కేక్ తినిపించేందుకు పంత్ యత్నించగా రోహిత్ నిరాకరించారు. గెలిచాకే తింటానని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. రోహిత్, పంత్తో పాటు బుమ్రా, సూర్య, జడేజా, దూబే, సిరాజ్, అర్షదీప్, ఖలీల్, కుల్దీప్, అక్షర్ ఉన్నారు.
Similar News
News December 6, 2025
హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్లో పోస్టులు

హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్(<
News December 6, 2025
రబీ వరి నారుమడిలో సస్యరక్షణ ఎలా?

వరి నారు పీకడానికి వారం రోజుల ముందు 5 సెంట్ల నారుమడికి 800 గ్రా. కార్బోఫ్యూరాన్ 3జి గుళికలను చల్లడం వల్ల నాటిన 20-25 రోజుల వరకు కాండం తొలుచు పురుగు, ఉల్లికోడు, ఆకుముడత వంటివి ఆశించకుండా నివారించవచ్చు. చలి వాతావరణం వల్ల అగ్గితెగులు ఎక్కువగా సోకే అవకాశం ఉన్నందున అగ్గి తెగులు కట్టడికి లీటరు నీటికి ట్రైసైక్లోజోల్ 0.6 గ్రా. లేదా ఐసోప్రోథయోలిన్ 1.5ml కలిపి పిచికారీ చేసుకోవాలి.
News December 6, 2025
ఈ నెల 25న ‘అఖండ-2’ విడుదల!

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన ‘అఖండ-2’ ఈ నెల 25న రిలీజ్ కానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని తెలిపాయి. దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఈ మూవీ నిన్ననే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడిన సంగతి తెలిసిందే.


