News May 26, 2024

టీ20 వరల్డ్ కప్ గెలిచాకే కేక్ తింటా: రోహిత్ శర్మ

image

భారత కెప్టెన్ రోహిత్ శర్మ సహా పలువురు ప్లేయర్స్ టీ20 వరల్డ్‌ కప్ కోసం తాజాగా అమెరికాకు చేరుకున్న సంగతి తెలిసిందే. బయలుదేరే ముందు వారు కేక్ కటింగ్ వేడుక చేసుకున్నారు. కేక్ తినిపించేందుకు పంత్ యత్నించగా రోహిత్‌ నిరాకరించారు. గెలిచాకే తింటానని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. రోహిత్‌, పంత్‌తో పాటు బుమ్రా, సూర్య, జడేజా, దూబే, సిరాజ్, అర్షదీప్, ఖలీల్, కుల్‌దీప్, అక్షర్‌ ఉన్నారు.

Similar News

News February 18, 2025

కుంభమేళా పొడిగింపు..? యూపీ సర్కారు జవాబు ఇదే

image

భక్తుల రద్దీని, డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని మహా కుంభమేళాను మరో రెండు రోజుల పాటు పొడిగిస్తారంటూ వస్తున్న వార్తలపై యూపీ సర్కారు స్పందించింది. అలాంటి ఆలోచనలేవీ లేవని తేల్చిచెప్పింది. ముందుగా చెప్పినట్లుగానే ఈ నెల 26న మహాశివరాత్రి రోజునే కుంభమేళా ముగుస్తుందని వివరించింది. తాము అధికారికంగా చెబితే తప్ప.. సోషల్ మీడియాలో వచ్చే వదంతుల్ని నమ్మొద్దని సూచించింది.

News February 18, 2025

వచ్చే వారం నుంచే ఎన్టీఆర్-నీల్ సినిమా షూట్?

image

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 31వ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘డ్రాగన్’ అన్న వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కే ఈ సినిమా షూటింగ్ వచ్చే వారం నుంచి ప్రారంభం కానుందని సినీ వర్గాల సమాచారం. వికారాబాద్ అడవుల్లో స్టార్ట్ చేయనున్న ఈ తొలి షెడ్యూల్‌లో ఎన్టీఆర్ పాల్గొనరని భోగట్టా. మూవీ కోసం ఆర్ఎఫ్‌సీలో ఇప్పటికే భారీ సెట్‌ తయారవుతోంది. ఆ సెట్లో జరిగే సెకండ్ షెడ్యూల్‌కు తారక్ వస్తారని తెలుస్తోంది.

News February 18, 2025

బావ కోసం హెలికాప్టర్ ఏర్పాటు చేసిన బావమరిది!

image

బావమరిది బతుకగోరతాడని సామెత. బిహార్‌లోని వైశాలి ప్రాంతంలో ఓ బావమరిది తన సోదరి భర్త కోసం ఏకంగా హెలికాప్టర్ ఏర్పాటు చేశాడు. పెళ్లైన తర్వాత తొలిసారిగా అతడి సోదరి భర్తతో పుట్టింటికి వస్తుండటంతో వాళ్లు చాలా గ్రాండ్‌గా రావాలని పట్నా నుంచి వైశాలి వరకూ 30 కిలోమీటర్ల దూరం మేర హెలికాప్టర్‌లో తీసుకొచ్చాడు. ఈ వేడుకను తిలకించేందుకు స్థానికులు వారి ఇంటి వద్ద పెద్ద ఎత్తున గుమిగూడారు.

error: Content is protected !!