News April 30, 2024
IIT ఖరగ్పూర్: 33% మందికి రాని ఉద్యోగాలు!

ఐఐటీల్లో చదివితే రూ.లక్షల ప్యాకేజీతో కొలువులు సొంతం అనే మాట వింటూ ఉంటాం. ఇందుకు భిన్నంగా IIT ఖరగ్పూర్కు సంబంధించి ఆసక్తికర విషయం వెలుగు చూసింది. 2022-23 విద్యా సంవత్సరంలో 33% మంది విద్యార్థులకు ఉద్యోగాలు రాలేదట. 2,490 మంది ప్లేస్మెంట్స్ కోసం దరఖాస్తు చేస్తే 1,675 మందికే కొలువులు దక్కాయి. 2021-22లో 2,256 మందికి గాను 1,615 మందికి ఉద్యోగాలొచ్చాయి. సగటు వేతనం రూ.16లక్షల నుంచి రూ.18లక్షలుగా ఉంది.
Similar News
News November 28, 2025
గొర్రెల్లో బొబ్బ రోగం(అమ్మతల్లి) ఎలా గుర్తించాలి?

ఇది ఏడాదిలో ఏ కాలంలోనైనా, ఏ ప్రాంతాల్లో గొర్రెలకైనా సోకే అంటువ్యాధి. ఇది సోకిన గొర్రెలు ఆకస్మికంగా నీరసంగా మారతాయి. శరీర ఉష్ణోగ్రత పెరిగి కళ్లు ఎర్రబడి నీరు కారతాయి. వ్యాధి సోకిన 1,2 రోజుల్లో గొర్రె శరీర భాగాలపై దద్దుర్లు ఏర్పడి క్రమేణా పెద్దవై, బొబ్బలుగా మారి చీము పట్టి నలుపు రంగులోకి మారతాయి. వ్యాధి తీవ్రత బట్టి సుమారు 20-30% గొర్రెలు మరణిస్తాయి. ఈ లక్షణాలను గుర్తించిన వెంటనే చికిత్స అందించాలి.
News November 28, 2025
తిరుమల శ్రీవారి పుష్పాలను ఏం చేస్తారో తెలుసా?

తిరుమల శ్రీవారి సేవ కోసం రోజుకు కొన్ని వందల కిలోల పూలు వాడుతారు. మరి వాటిని ఏం చేస్తారో మీకు తెలుసా? పూజ తర్వాత వాటిని బయట పడేయరు. తిరుపతికి తరలిస్తారు. అక్కడ శ్రీ పద్మావతి అమ్మవారి ఉద్యానవనంలోని పూల ప్రాసెసింగ్ యూనిట్కు పంపుతారు. ఈ యూనిట్లో ఈ పూల నుంచి పరిమళభరితమైన అగరబత్తులు, ఇతర సుగంధ ద్రవ్యాలను తయారుచేస్తారు. తద్వారా పూల పవిత్రతను కాపాడుతూనే, వాటిని ఉపయోగకరమైన ఉత్పత్తులుగా మారుస్తారు.
News November 28, 2025
2026 సెలవుల జాబితా విడుదల

కేంద్రం 2026 సంవత్సరానికి అధికారిక <


