News April 15, 2025

మళ్లీ అనారోగ్యం.. భేటీకి హాజరుకాకుండానే..

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి అనారోగ్యం పాలైనట్లు తెలుస్తోంది. ఇవాళ సచివాలయంలో జరుగుతున్న క్యాబినెట్ భేటీలో పాల్గొనేందుకు వచ్చారు. కానీ ఆరోగ్యం సహకరించకపోవడంతో మీటింగ్ మొదలుకాకుండానే వెనుదిరిగారు. ప్రస్తుతం ఆయన క్యాంప్ కార్యాలయంలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ పవన్ పలుసార్లు అనారోగ్యం కారణంగా మంత్రివర్గ సమావేశాలకు గైర్హాజరైన విషయం తెలిసిందే.

Similar News

News April 25, 2025

ఉగ్రదాడిని మిలిటెంట్ల దాడిగా పేర్కొన్న NYT.. US ఆగ్రహం

image

జమ్మూకశ్మీర్ పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని న్యూయార్క్ టైమ్స్(NYT) పత్రిక మిలిటెంట్ల దాడిగా పేర్కొంది. దీనిపై అమెరికా ప్రభుత్వం మండిపడింది. ఇండియా/ఇజ్రాయెల్ లేదా మరేచోటైనా టెర్రరిజం విషయానికి వచ్చేసరికి NYT వాస్తవాల నుంచి దూరం జరుగుతుందని ఫైరయ్యింది. ఈ మేరకు US ఫారిన్ అఫైర్స్ కమిటీ Xలో పోస్టు చేసింది. ఆ పత్రిక క్లిప్పింగ్‌లో మిలిటెంట్లుగా పేర్కొన్న భాగాన్ని కొట్టేసి టెర్రరిస్టులుగా మార్పు చేసింది.

News April 25, 2025

రోజూ 40 రోటీలు తినేవాడిని: జైదీప్

image

తనకు 28 ఏళ్ల వయసు వచ్చే వరకు రోజూ 40 రోటీలు తిని, లీటరున్నర పాలు తాగేవాడినని ‘పాతాళ్‌లోక్’ ఫేమ్ జైదీప్ అహ్లావత్ వెల్లడించారు. అయినా తాను 70KGల బరువు దాటలేదని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఒక వయసు దాటాక తిండిలో మార్పులు చేసుకోవాలని, అప్పుడే జీవనశైలి బాగుంటుందని చెప్పారు. ఎక్కడ షూటింగ్ జరిగినా ఇప్పటికీ ఇంటి ఆహారమే తింటానన్నారు. విదేశాలకు వెళ్లినప్పుడు అందుబాటులో ఉన్నవాటితో సర్దుకుంటానని పేర్కొన్నారు.

News April 25, 2025

ప్రత్యామ్నాయ మార్గాల్లో విమాన ప్రయాణాలు

image

పాకిస్థాన్ గగనతలాన్ని మూసివేయడంపై భారత విమానయాన సంస్థలు స్పందించాయి. US, UK, యూరప్, పశ్చిమాసియా దేశాలకు ప్రయాణించే విమానాలు ప్రత్యామ్నాయ సుదూర మార్గంలో వెళ్లాల్సి ఉంటుందని తెలిపాయి. దీనివల్ల ప్రయాణ సమయం పెరుగుతుందని, అసౌకర్యానికి చింతిస్తున్నామని ఎయిర్ ఇండియా, ఇండిగో పేర్కొన్నాయి. ట్రావెల్ టైమ్ పెరగడంతో టికెట్ల ధరలు కూడా అధికమయ్యే అవకాశం ఉందని నిపుణుల అంచనా.

error: Content is protected !!