News January 15, 2025

IMDకి నేటితో 150 ఏళ్లు

image

భారత వాతావరణ విభాగం(IMD) నేడు 150వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. 1875, జనవరి 15న దీనిని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం స్థాపించింది. 1864, 1866, 1871లో తీవ్రమైన విపత్తులు సంభవించడంతో వాతావరణ పరిస్థితులను ముందుగా అంచనా వేసేందుకు దీనిని నెలకొల్పారు. వాతావరణ పరిస్థితుల్ని కచ్చితత్వంతో అంచనా వేయడంలో ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. హిందూ మహా సముద్ర తీరంలోని 13 దేశాలతో పాటు సార్క్ దేశాలకు సేవలందిస్తోంది.

Similar News

News February 18, 2025

1947లో ధరలిలా ఉండేవి!

image

డాలర్ విలువ ఒక రూపాయితో సమానంగా ఉండేది. 10 గ్రాముల బంగారం ధర రూ.88 మాత్రమే. ప్రభుత్వ ఉద్యోగుల్లో అధిక జీతం రూ.2వేలు. చీపెస్ట్ కార్ రూ.2500. సౌత్ ఢిల్లీలో ఒక ఎకరం భూమి ధర రూ.17వేలు, ముంబైలో 2BHK రెంట్ రూ.20-50 మాత్రమే. బేసిక్ మెడికల్ టెస్టులు రూ.100- రూ.500. రూ.25కే సైకిల్ వచ్చేది. రూ.4కే కేజీ స్వచ్ఛమైన నెయ్యి. పెట్రోల్ ధరలు లీటర్‌కు 27 పైసలు.

News February 18, 2025

BREAKING: ఫలితాలు విడుదల

image

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) CHSL-2024 తుది ఫలితాలు విడుదలయ్యాయి. 2024 APRలో ఈ నోటిఫికేషన్ విడుదలవ్వగా జులైలో టైర్-1, NOVలో టైర్-2 ఎగ్జామ్స్ నిర్వహించారు. మొత్తం 3,954 పోస్టులు ఉన్నాయి. తాజాగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల వివరాలను సైట్‌లో పొందుపర్చింది. వీరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత నియామక ప్రక్రియ పూర్తవుతుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News February 18, 2025

9 మంది ESI ఆస్పత్రి ఉద్యోగులను సస్పెండ్ చేసిన మంత్రి

image

AP: రాజమహేంద్రవరం ESI ఆస్పత్రిలో 9మంది ఉద్యోగులపై సన్పెన్షన్ వేటు పడింది. కొందరు వైద్యులు, సిబ్బంది విధుల్లో లేకుండా సంతకాలు పెట్టి వెళ్లడాన్ని నిన్నటి ఆకస్మిక పర్యటనలో మంత్రి వాసంశెట్టి సుభాష్ గుర్తించి మండిపడ్డారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించగా.. రాష్ట్ర బీమా వైద్య సేవల డైరెక్టర్ ఆంజనేయులు ఇవాళ సస్పెండ్ చేశారు. ఇన్‌ఛార్జ్ సూపరింటెండెంట్‌, ముగ్గురు డ్యూటీ డాక్టర్లు తదితరులపై వేటు పడింది.

error: Content is protected !!