News March 15, 2025
IMLT20: ఫైనల్ చేరిన వెస్టిండీస్

ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20లో వెస్టిండీస్ ఫైనల్కు దూసుకెళ్లింది. శ్రీలంక మాస్టర్స్తో జరిగిన మ్యాచులో 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 179 పరుగులు చేసింది. ఛేదనలో గుణరత్నే(66) పోరాడినా శ్రీలంక 173 పరుగులకే పరిమితమైంది. రేపు జరిగే ఫైనల్లో ఇండియా మాస్టర్స్తో వెస్టిండీస్ తలపడనుంది.
Similar News
News April 24, 2025
ఇది భారత్పై దాడి: ప్రధాని మోదీ

పహల్గామ్లో పర్యాటకులపై దాడిని భారత్పై దాడిగా ప్రధాని మోదీ అభివర్ణించారు. మృతుల కుటుంబాలకు దేశం మొత్తం అండగా ఉంటుందన్నారు. ఈ నరమేధాన్ని ప్రపంచ దేశాలన్నీ ముక్తకంఠంతో ఖండించాయని మోదీ గుర్తు చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఉగ్రవాదులను విడిచిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. ఆప్తులను కోల్పోయినవారికి న్యాయం చేయడానికి అన్ని చర్యలు చేపడతామని వెల్లడించారు.
News April 24, 2025
ఉపాధి హామీ.. ‘కూలీ’ అనే పదం వాడొద్దు: పవన్

AP: ఉపాధి హామీ పథకంలో 75లక్షల మందికి పైగా శ్రామికులకు నిధులు ఇచ్చామని Dy.CM పవన్ కళ్యాణ్ తెలిపారు. ఉపాధి హామీ పథకంలో కూలీ అనే పదానికి బదులుగా గ్రామీణ వికాస శ్రామికుడు అనే పదాన్ని వాడాలని అన్నారు. మంగళగిరిలో జరిగిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంలో ఆయన ప్రసంగించారు. గత ప్రభుత్వం వల్ల గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. తాను పంచాయతీరాజ్ శాఖను చాలా ఇష్టంగా ఎంచుకున్నానని చెప్పారు.
News April 24, 2025
పాకిస్థానీ అంటూ ఆరోపణలు: స్పందించిన ప్రభాస్ హీరోయిన్

తాను పాకిస్థాన్ సంతతి యువతినంటూ వస్తున్న వార్తల్ని ‘ఫౌజీ’ హీరోయిన్ ఇమాన్వీ ఖండించారు. ‘నేను పాకిస్థానీ సైనికాధికారి కూతురినన్నది పచ్చిఅబద్ధం. ఆన్లైన్ ట్రోలర్లు ఆ విషయాన్ని వ్యాప్తి చేశారు. మా తల్లిదండ్రులు లాస్ఏంజిలిస్కు వలస వెళ్లారు. నేను అక్కడే పుట్టాను. హిందీ, తెలుగు, గుజరాత్, ఇంగ్లిష్ మాట్లాడే భారత సంతతి అమ్మాయిని నేను. ఈ బాధాకర సమయంలో ద్వేషాన్ని కాదు.. ప్రేమను వ్యాప్తి చేయండి’ అని కోరారు.