News April 11, 2024

కీలక ఆదేశాలు.. ఒకటో తరగతిలో చేరేందుకు కనీస వయసు ఆరేళ్లు

image

యూపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒకటో తరగతిలో చేరేందుకు కనీస వయసు ఆరేళ్లుగా నిర్ధారిస్తూ అన్ని స్కూళ్లకు ఆదేశాలు ఇచ్చింది. 2024 ఏప్రిల్ 1 వరకు ఆరేళ్లు నిండినవారిని అర్హులుగా పరిగణించాలని పేర్కొంది. జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆరేళ్ల కన్నా తక్కువ వయసు గల పిల్లలు కిండర్‌గార్టెన్‌(ప్రీ స్కూల్)లో చేరాలని సూచించింది.

Similar News

News December 10, 2025

గ్లోబల్ సమ్మిట్‌కు విద్యార్థులు.. PHOTO GALLERY

image

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో విద్యార్థులు సందడి చేశారు. నిన్నటితో సమ్మిట్ ముగియగా ఇవాళ ఫ్యూచర్‌ సిటీలోని వేదిక వద్దకు స్టూడెంట్స్‌కు అధికారులు ఉచిత ప్రవేశం కల్పించారు. వారంతా అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ఆసక్తిగా తిలకించారు. రోబో చేస్తున్న పనులను చూసి పారిశుద్ధ్య కార్మికులు ఆశ్చర్యపోయారు. అందుకు సంబంధించిన ఫొటోలను పైన గ్యాలరీలో చూడవచ్చు.

News December 10, 2025

వాస్తు ప్రకారం 4 మూలల్లో ఏమేం ఉండాలి?

image

ఇంటి మూలలు ప్రకృతి శక్తులకు అనుగుణంగా ఉండాలని వాస్తు శాస్త్రం సూచిస్తోంది. దీని ప్రకారం.. ఇంటికి ఈశాన్య మూలలో గుంట(లోతు/నీరు), ఆగ్నేయ మూలలో మంట(వంటగది), నైరుతి మూలలో మెట్టగా(ఎత్తుగా, బరువుగా), వాయువ్య మూలలో గాలి(చలనం) ఉండేలా చూసుకోవాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఇది మంచి సంబంధాలకు, చలనానికి తోడ్పడుతుందని వివరిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>

News December 10, 2025

పవన్‌కు నీతి, ధర్మం లేవు: అంబటి

image

AP: పరకామణి చోరీ విషయంలో జగన్ వ్యాఖ్యలను పవన్ వక్రీకరిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. అసలు పవన్ ఏ ధర్మాన్ని పాటిస్తున్నారని ప్రశ్నించారు. ‘నేను బాప్టిస్ట్ మతం తీసుకున్నానని ఒకసారి, సర్వమతాలూ సమానమని మరోసారి అన్నాడు. ఇప్పుడు సనాతనమే తన ధర్మం అంటున్నాడు. నీకో ధర్మం లేదు, నీతి లేదు, మతం లేదు, సిద్ధాంతం లేదు. నీకున్న ఒకే ఒక్క సిద్ధాంతం CBN చెప్పింది చేయడం’ అని సెటైర్లు వేశారు.