News April 11, 2024
కీలక ఆదేశాలు.. ఒకటో తరగతిలో చేరేందుకు కనీస వయసు ఆరేళ్లు

యూపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒకటో తరగతిలో చేరేందుకు కనీస వయసు ఆరేళ్లుగా నిర్ధారిస్తూ అన్ని స్కూళ్లకు ఆదేశాలు ఇచ్చింది. 2024 ఏప్రిల్ 1 వరకు ఆరేళ్లు నిండినవారిని అర్హులుగా పరిగణించాలని పేర్కొంది. జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆరేళ్ల కన్నా తక్కువ వయసు గల పిల్లలు కిండర్గార్టెన్(ప్రీ స్కూల్)లో చేరాలని సూచించింది.
Similar News
News December 23, 2025
నేడు పంచముఖ హనుమంతుడిని పూజిస్తే..?

మంగళవారం నాడు పంచముఖ హనుమంతుడిని పూజించడం వల్ల విశేష ఫలితాలుంటాయని పండితులు చెబుతున్నారు. జాతకంలోని కుజ దోష నివారణకు, రుణ బాధల నుంచి విముక్తి కోసం ఈ పూజ చేయాలంటున్నారు. ‘5 ముఖాల స్వామిని ఆరాధించడం వల్ల 5 దిశల నుంచి రక్షణ లభిస్తుంది. వ్యాధుల నుంచి విముక్తి, శత్రువులపై విజయం సాధిస్తారు. ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. విద్యార్థులకు ఏకాగ్రత, జ్ఞానం లభిస్తాయి’ అంటున్నారు.
News December 23, 2025
BSF 549 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News December 23, 2025
హైట్ను పెంచే హస్తపాదాసనం

ప్రతిరోజూ హస్తపాదాసనం సాధన చెయ్యడం ఎత్తు పెరగడంలో తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. రెండు కాళ్లు దగ్గరగా పెట్టి నిల్చొని గట్టిగా శ్వాస పీల్చి ముందుకు వంగాలి. చేతులు నేలపై ఆనించాలి. తలను మోకాళ్లకు తాకించాలి. మోకాళ్లను వంచకుండా ఈ భంగిమలో కాసేపు ఉండాలి. తరువాత యథాస్థానానికి రావాలి. ఇలా నాలుగైదు సార్లు చేయాలి. ఈ ఆసనం రోజూ సాధన చేస్తే పూర్తిస్థాయిలో చేయడం వీలవుతుంది.


