News April 11, 2024
కీలక ఆదేశాలు.. ఒకటో తరగతిలో చేరేందుకు కనీస వయసు ఆరేళ్లు

యూపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒకటో తరగతిలో చేరేందుకు కనీస వయసు ఆరేళ్లుగా నిర్ధారిస్తూ అన్ని స్కూళ్లకు ఆదేశాలు ఇచ్చింది. 2024 ఏప్రిల్ 1 వరకు ఆరేళ్లు నిండినవారిని అర్హులుగా పరిగణించాలని పేర్కొంది. జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆరేళ్ల కన్నా తక్కువ వయసు గల పిల్లలు కిండర్గార్టెన్(ప్రీ స్కూల్)లో చేరాలని సూచించింది.
Similar News
News December 23, 2025
‘నీళ్లను ఒక్కసారిగా వదులుతోంది’.. భారత్పై పాక్ ఆరోపణలు!

భారత్ కావాలనే నదీ జలాలను అడ్డుకుంటూ ఇబ్బందులకు గురిచేస్తోందని పాక్ ఆరోపిస్తోంది. చీనాబ్ తర్వాత ఇప్పుడు జీలం, నీలం నదుల ప్రవాహం కూడా తగ్గిపోయిందని అంటోంది. భారత్ అర్ధాంతరంగా నీళ్లు ఆపుతూ ఒక్కసారిగా వదిలేస్తోందని పేర్కొంది. నీటి ప్రవాహం పడిపోవడం తమ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీస్తోందని వాదిస్తోంది. దీనిపై మన ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. పహల్గాం దాడి తర్వాత ‘సింధు జలాల’ ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకుంది.
News December 23, 2025
తల్లి అయిన తర్వాత నా బాడీపై గౌరవం పెరిగింది: కియారా

హీరోయిన్ కియారా అద్వానీ రీసెంట్గా తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ గురించి మనసు విప్పారు. 2025 జులైలో పాప పుట్టిన తర్వాత, తన శరీరాన్ని చూసే కోణం మారిందని చెప్పారు. ‘వార్ 2’ సినిమాలో బికినీ సీన్ కోసం చాలా కష్టపడ్డానని, అప్పట్లో పర్ఫెక్ట్ ఫిగర్ కోసం తాపత్రయపడ్డానని గుర్తు చేసుకున్నారు. కానీ ఒక ప్రాణానికి జన్మనిచ్చిన తన శరీరం పట్ల చాలా గౌరవం పెరిగిందని, సైజ్ ముఖ్యం కాదని గుర్తించానని తెలిపారు.
News December 23, 2025
విద్యుత్ ఛార్జీలు తగ్గించండి… ఇరిగేషన్ శాఖ లేఖ

TG: ప్రధాన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సరఫరా అయ్యే విద్యుత్పై అదనపు ఛార్జీలను తగ్గించాలని ఇరిగేషన్ శాఖ విద్యుత్ నియంత్రణ మండలికి లేఖ రాసింది. నెలకు KVAకు ₹300 చొప్పున వసూలు చేయడాన్ని ఆపాలంది. యూనిట్ విద్యుత్కు వసూలు చేస్తున్న ₹6.30 సుంకాన్నీ తగ్గించాలని పేర్కొంది. ప్రస్తుతం లిఫ్ట్ ఇరిగేషన్లకు సరఫరా అవుతున్న విద్యుత్ లోడ్ 2819.80 MWగా ఉంది. 2026లో ఇది 7348 MWకు చేరుతుందని అంచనా.


