News April 11, 2024
కీలక ఆదేశాలు.. ఒకటో తరగతిలో చేరేందుకు కనీస వయసు ఆరేళ్లు

యూపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒకటో తరగతిలో చేరేందుకు కనీస వయసు ఆరేళ్లుగా నిర్ధారిస్తూ అన్ని స్కూళ్లకు ఆదేశాలు ఇచ్చింది. 2024 ఏప్రిల్ 1 వరకు ఆరేళ్లు నిండినవారిని అర్హులుగా పరిగణించాలని పేర్కొంది. జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆరేళ్ల కన్నా తక్కువ వయసు గల పిల్లలు కిండర్గార్టెన్(ప్రీ స్కూల్)లో చేరాలని సూచించింది.
Similar News
News December 12, 2025
ఘోర ప్రమాదానికి కారణాలేంటి?

AP: అల్లూరి(D)లో జరిగిన బస్సు <<18539495>>ప్రమాదానికి<<>> గల కారణాలపై పోలీసులు ఓ అంచనాకు రాలేకపోతున్నారు. మలుపు దగ్గర డ్రైవర్ బస్సును కంట్రోల్ చేయలేకపోయారా? ఘాట్ రోడ్డులో జర్నీ డ్రైవర్కు కొత్త కావడం వల్లే బోల్తా కొట్టిందా? దట్టమైన పొగమంచుతో దారి కనిపించలేదా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సిగ్నల్ లేని ప్రాంతం కావడంతో బాధితులు 108కి ఫోన్ చేయడం ఆలస్యమైంది. అంబులెన్సులు ప్రమాదస్థలికి వెళ్లడంలోనూ లేటయ్యింది.
News December 12, 2025
INDvsSA.. 5 పరుగులు, 5 వికెట్లు

SAతో రెండో టీ20లో IND 162 పరుగులకు ఆలౌటై 51 రన్స్ తేడాతో <<18539012>>ఓడింది<<>>. చివరి 5 వికెట్లను 5 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. 8 బంతుల్లో 5 వికెట్లు పడ్డాయి. 157 రన్స్ వద్ద 6, 158 వద్ద 7, 162 వద్ద 8, 9, పదో వికెట్ పడింది. అభిషేక్(17), గిల్(0), SKY(5), తొలి టీ20లో అదరగొట్టిన హార్దిక్ (23 బంతుల్లో 20) స్థాయికి తగ్గట్లుగా ఆడకపోవడం, స్పిన్నర్లను బాగా ఆడే దూబేను 8వ స్థానంలో బ్యాటింగ్కు పంపడం INDను దెబ్బతీసింది.
News December 12, 2025
ప్రెగ్నెన్సీకి ముందు ఏ టెస్టులు చేయించుకోవాలంటే..

ప్రతి మహిళ ప్రెగ్నెంట్ అయ్యే ముందు కొన్ని ఆరోగ్య పరీక్షలు కచ్చితంగా చేయించుకోవాలంటున్నారు నిపుణులు. వాటిల్లో ముఖ్యమైనవి రూబెల్లా, చికెన్ పాక్స్, HIV, హెర్సస్, హెపటైటిస్ B, థైరాయిడ్, జన్యు పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలి. వీటితో పాటు గవదబిళ్లలు, మీజిల్స్, రుబెల్లా టీకాలు కచ్చితంగా తీసుకోవాలి. అలాగే మానసిక ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి మెంటల్ హెల్త్ చెకప్ కచ్చితంగా చేయించుకోవాలని సూచిస్తున్నారు.


