News April 11, 2024

కీలక ఆదేశాలు.. ఒకటో తరగతిలో చేరేందుకు కనీస వయసు ఆరేళ్లు

image

యూపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒకటో తరగతిలో చేరేందుకు కనీస వయసు ఆరేళ్లుగా నిర్ధారిస్తూ అన్ని స్కూళ్లకు ఆదేశాలు ఇచ్చింది. 2024 ఏప్రిల్ 1 వరకు ఆరేళ్లు నిండినవారిని అర్హులుగా పరిగణించాలని పేర్కొంది. జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆరేళ్ల కన్నా తక్కువ వయసు గల పిల్లలు కిండర్‌గార్టెన్‌(ప్రీ స్కూల్)లో చేరాలని సూచించింది.

Similar News

News December 11, 2025

రోహిత్ గొప్ప హృదయానికి అది నిదర్శనం: జైస్వాల్

image

సౌతాఫ్రికాతో ఇటీవల భారత్ ఆడిన మూడో వన్డేలో యశస్వి జైస్వాల్ తన కెరీర్‌లోనే తొలి సెంచరీ చేసిన విషయం తెలిసిందే. అయితే క్రీజులో కుదురుకునేందుకు ఆయన చాలా ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో మరో ఎండ్‌లో ఉన్న రోహిత్ తనతో మాట్లాడుతూ భరోసా ఇచ్చినట్లు జైస్వాల్ తెలిపారు. ‘నేను రిస్క్ తీసుకుంటా. నువ్వు ప్రశాంతంగా టైం తీసుకొని ఆడు’ అని తనతో చెప్పినట్లు వివరించారు. ఇది తన గొప్ప హృదయానికి నిదర్శనం అని కొనియాడారు.

News December 11, 2025

అలా తిట్టడం వల్లే ‘రాజా సాబ్’ తీశా: మారుతి

image

నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్లు, తిట్టేవాళ్లకి చాలా థాంక్స్ అని డైరెక్టర్ మారుతి అన్నారు. అలాంటి వారు లేకపోతే తాను ‘రాజా సాబ్’ తీసేవాడిని కాదని తెలిపారు. వారంతా తమ పనులన్నీ మానుకొని, పాజిటివిటీని చంపుకొని మరొకరి కోసం టైం పెడుతున్నారని సెటైరికల్ కామెంట్స్ చేశారు. తమలోని నెగిటివిటీని వారు పంచుతున్నారని, అదంత ఈజీ కాదన్నారు. ఎవరైనా తిడితే ఎనర్జీగా మార్చుకొని ముందుకెళ్లాలని ఓ ఈవెంట్‌లో సూచించారు.

News December 11, 2025

పదేళ్ల తర్వాత జాతీయ స్థాయి పోటీలు: రాంప్రసాద్ రెడ్డి

image

AP: రాష్ట్రంలో పదేళ్ల తర్వాత జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ నిర్వహిస్తున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. యోనెక్స్-సన్‌రైజ్ 87వ జాతీయ పోటీల పోస్టర్‌ను CM చంద్రబాబు ఆవిష్కరించగా ఆయన్ను ప్రారంభోత్సవానికి మంత్రి ఆహ్వానించారు. DEC 24-28వ తేదీ వరకు పోటీలు జరుగుతాయన్నారు. టోర్నమెంట్‌ విజయవంతంగా నిర్వహించేందుకు క్రీడా శాఖ, మున్సిపాలిటీ, శాప్ విభాగాలు ఏర్పాట్లు చేస్తున్నాయని CMకు వివరించారు.