News April 11, 2024
కీలక ఆదేశాలు.. ఒకటో తరగతిలో చేరేందుకు కనీస వయసు ఆరేళ్లు

యూపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒకటో తరగతిలో చేరేందుకు కనీస వయసు ఆరేళ్లుగా నిర్ధారిస్తూ అన్ని స్కూళ్లకు ఆదేశాలు ఇచ్చింది. 2024 ఏప్రిల్ 1 వరకు ఆరేళ్లు నిండినవారిని అర్హులుగా పరిగణించాలని పేర్కొంది. జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆరేళ్ల కన్నా తక్కువ వయసు గల పిల్లలు కిండర్గార్టెన్(ప్రీ స్కూల్)లో చేరాలని సూచించింది.
Similar News
News December 26, 2025
మామిడిలో మంచి పూతకు నిపుణుల సూచనలు

మామిడిలో పూమొగ్గలను ఉత్తేజపరిచి త్వరగా పూత తెప్పించడానికి, ఆడపూల శాతం పెంచడానికి లీటరు నీటికి పొటాషియం నైట్రేట్ 10గ్రా., లీటరు నీటికి బోరాన్ 2గ్రా. కలిపి పిచికారీ చేయాలి. పూమొగ్గ దశలో తేనెమంచు పురుగు నివారణకు లీటరు నీటికి క్లోరిపైరిఫాస్ 2.5ml కలిపి పూత మొదలయ్యే సమయం, పిందెలు తయారయ్యే సమయంలో పూత, ఆకులపైనే కాకుండా మొదళ్లపైన, కొమ్మలపైన కూడా పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News December 26, 2025
ఇండియా ఆప్టెల్ లిమిటెడ్లో 150 పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు

<
News December 26, 2025
మోహన్లాల్ సినిమాకు తొలి రోజు ₹70 లక్షలే!

మోహన్లాల్ హీరోగా నటించిన ‘వృషభ’ సినిమా తొలిరోజు షాకింగ్ కలెక్షన్లు నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ₹70 లక్షల వసూళ్లు మాత్రమే సాధించింది. మలయాళంలో ₹46 లక్షలు, తెలుగులో ₹13 లక్షలు, హిందీలో ₹2 లక్షలే వచ్చాయి. ఎపిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ అంచనాలను అందుకోలేదు. మోహన్లాల్ నటన ఆకట్టుకున్నా, కంటెంట్ బాగా లేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. కాగా ఈ సినిమా బడ్జెట్ ₹70 కోట్లకు పైనే కావడం గమనార్హం.


