News April 11, 2024
కీలక ఆదేశాలు.. ఒకటో తరగతిలో చేరేందుకు కనీస వయసు ఆరేళ్లు

యూపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒకటో తరగతిలో చేరేందుకు కనీస వయసు ఆరేళ్లుగా నిర్ధారిస్తూ అన్ని స్కూళ్లకు ఆదేశాలు ఇచ్చింది. 2024 ఏప్రిల్ 1 వరకు ఆరేళ్లు నిండినవారిని అర్హులుగా పరిగణించాలని పేర్కొంది. జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆరేళ్ల కన్నా తక్కువ వయసు గల పిల్లలు కిండర్గార్టెన్(ప్రీ స్కూల్)లో చేరాలని సూచించింది.
Similar News
News December 13, 2025
అంధుల క్రికెట్ కెప్టెన్ దీపిక కోరిన రోడ్లు మంజూరు

AP: WC గెలిచిన అంధ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక తన ఊరికి రోడ్డు లేదని నిన్న Dy.CM పవన్ను కలిసినప్పుడు తెలిపారు. శ్రీసత్యసాయి(D) హేమావతి-తంబలహెట్టి వరకు రోడ్డుకు రూ.3.2CR, గున్నేహళ్లి-తంబలహెట్టి రోడ్డుకు రూ.3CR అవసరమని అధికారులు అంచనా రూపొందించగా, పర్మిషన్ ఇవ్వాలని పవన్ ఆదేశించారు. సాయంత్రానికి జిల్లా కలెక్టర్ పాలనపరమైన అనుమతులిచ్చారు. మరోవైపు జట్టుకు పవన్ రూ.84లక్షల ప్రోత్సాహకం అందించారు.
News December 13, 2025
స్టార్ ఫ్రూట్ వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్!

వింటర్ సీజన్లో లభించే స్టార్ ఫ్రూట్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ‘వీటిల్లోని విటమిన్-B6 శరీర జీవక్రియను మెరుగుపరిచి కేలరీలు కరిగేలా చేస్తుంది. మెదడు పనితీరును పెంచి, మానసిక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. విటమిన్-C ఇమ్యూనిటీని పెంచి దగ్గు, జలుబు సమస్యలను తగ్గిస్తుంది. అధికంగా ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుంది. విటమిన్-A కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది’ అని వైద్యులు చెబుతున్నారు.
News December 13, 2025
డిసెంబర్ 13: చరిత్రలో ఈ రోజు

1952: దక్షిణ భారత నటి లక్ష్మి జననం
1955: కేంద్ర మాజీ మంత్రి మనోహర్ పారికర్ జననం
1960: విక్టరీ వెంకటేశ్(ఫొటోలో) జననం
1961: భారత దిగ్గజ క్రికెటర్ అలీఖాన్ పటౌడీ టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన రోజు
1986: హిందీ నటి స్మితా పాటిల్ మరణం
1990: హీరోయిన్ రెజీనా జననం
2001: భారత పార్లమెంటుపై ఉగ్రవాదులు దాడికి పాల్పడిన రోజు


