News April 11, 2024

కీలక ఆదేశాలు.. ఒకటో తరగతిలో చేరేందుకు కనీస వయసు ఆరేళ్లు

image

యూపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒకటో తరగతిలో చేరేందుకు కనీస వయసు ఆరేళ్లుగా నిర్ధారిస్తూ అన్ని స్కూళ్లకు ఆదేశాలు ఇచ్చింది. 2024 ఏప్రిల్ 1 వరకు ఆరేళ్లు నిండినవారిని అర్హులుగా పరిగణించాలని పేర్కొంది. జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆరేళ్ల కన్నా తక్కువ వయసు గల పిల్లలు కిండర్‌గార్టెన్‌(ప్రీ స్కూల్)లో చేరాలని సూచించింది.

Similar News

News December 14, 2025

ఏపీలో ₹లక్ష కోట్లతో ‘సాగర్‌మాల’ ప్రాజెక్టులు

image

AP: ‘సాగర్‌మాల’ కింద APలో ₹లక్ష కోట్లతో 110 ప్రాజెక్టులు ఏర్పాటుకానున్నట్లు కేంద్రం వెల్లడించింది. పారిశ్రామిక వృద్ధికి వీలుగా రాష్ట్రంలో ఈ ప్రాజెక్టులు నెలకొల్పనున్నట్లు పార్లమెంటులో పేర్కొంది. పోర్టు ఆధారిత పరిశ్రమలు, ఆధునీకరణ, రోడ్డు, రైల్వే కనెక్టివిటీ పెంపు, కోస్టల్ కమ్యూనిటీ, షిప్పింగ్, జలమార్గాల అభివృద్ధి వంటివి ఇందులో ఉన్నాయి. వీటితో తీరప్రాంతం లాజిస్టిక్ హబ్‌గా మారుతుందని పేర్కొంది.

News December 14, 2025

మెస్సీకి ఎందుకంత ఫాలోయింగో తెలుసా?

image

మెస్సీ పదేళ్ల వయసులో గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ (GHD)తో బాధపడ్డారు. 4 అడుగుల కంటే ఎత్తు పెరగడని డాక్టర్లు తేల్చేశారు. ఇంజెక్షన్లకు నెలకు $900-1,000 కావడంతో అతడి కుటుంబం భరించలేకపోయింది. స్పెయిన్‌లోని FC బార్సిలోనా అతడి టాలెంట్‌ను గుర్తించి తమ అకాడమీలో జాయిన్ చేసుకోవడంతో పాటు ట్రీట్మెంట్ చేయించింది. ఆ తర్వాత స్టార్ అయిన మెస్సీ ఫౌండేషన్ స్థాపించి ఎంతో హెల్ప్ చేస్తున్నారు. ప్రపంచకప్ కూడా గెలిచారు.

News December 14, 2025

నెలకు రూ.20వేలు.. రేపటి వరకే ఛాన్స్

image

RBI సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్-2026 (3 నెలలు) దరఖాస్తుల గడువు రేపటితో (DEC 15) ముగియనుంది. PG, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు, LLB, ఎకనామిక్స్, ఫైనాన్స్, కామర్స్, బ్యాంకింగ్ రిలేటెడ్ సబ్జెక్టుల్లో డిగ్రీ చేస్తున్న వారు అర్హులు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి RBI ఆఫీసుల్లో పని చేసే అవకాశం, నెలకు రూ.20వేలు స్టైఫండ్ లభిస్తుంది.
వెబ్‌సైట్: <>opportunities.rbi.org.in<<>>