News November 29, 2024
మహారాష్ట్రలో కీలక సమావేశం రద్దు

మహారాష్ట్ర CM ఎవరో తేల్చే కీలక సమావేశం రద్దైంది. నిన్న ఢిల్లీ వెళ్లిన ‘మహాయుతి’ నేతలు BJP అధిష్ఠానాన్ని కలిసినా స్పష్టత రాలేదు. ఇవాళ ముంబైలో సమావేశం నిర్వహించి CM ఎవరో ఫైనల్ చేస్తామని శిండే ప్రకటించారు. కాగా, ఆయన ఢిల్లీ నుంచి ముంబైకి రాగానే స్వగ్రామం సతారా జిల్లాలోని దారే బయల్దేరారు. దీంతో శివసేన పార్టీ సమావేశం కూడా వాయిదా పడింది. ఆయన ముంబై తిరిగొచ్చిన తర్వాతే ఆదివారం సమావేశాలు ఉంటాయని సమాచారం.
Similar News
News December 10, 2025
సుందర్ పిచాయ్తో మంత్రి లోకేశ్ భేటీ

US పర్యటనలో ఉన్న మంత్రి లోకేశ్ గూగుల్ CEO సుందర్ పిచాయ్తో భేటీ అయ్యారు. విశాఖలో AI డేటా సెంటర్ పురోగతిపై చర్చించారు. రాష్ట్రంలో రాబోయే డ్రోన్ సిటీ ప్రాజెక్టులో డ్రోన్ అసెంబ్లీ, టెస్టింగ్ యూనిట్ను ఏర్పాటు చేయాలని లోకేశ్ కోరారు. విస్ట్రాన్ న్యూ వెబ్ కార్పొరేషన్ ద్వారా డేటా సెంటర్-సర్వర్ తయారీ ఎకోసిస్టమ్ను ప్రోత్సహించాలన్నారు. సంస్థలో వీటిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని సుందర్ పిచాయ్ తెలిపారు.
News December 10, 2025
IOCLలో 509 పోస్టులకు నోటిఫికేషన్

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (<
News December 10, 2025
దారిద్ర్య దహన గణపతి స్తోత్రం ఎందుకు పఠించాలి?

ఆర్థిక సమస్యలు, దారిద్ర్య బాధలను తొలగించుకోవడానికి ఈ స్తోత్రాన్ని పఠించాలని పండితులు సూచిస్తున్నారు. నిత్యం పఠిస్తే గణేశుని అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు చేకూరుతాయని చెబుతున్నారు. ‘తలపెట్టిన పనులు అడ్డంకులు లేకుండా పూర్తవుతాయి. ఈ మహా మహిమాన్విత స్తోత్రాన్ని 45 రోజుల పాటు క్రమం తప్పకుండా పఠిస్తే, ఆ వంశంలో పది తరాల వరకు దారిద్ర్య బాధలుండవని శాస్త్రాలు చెబుతున్నాయి’ అని అంటున్నారు.


