News October 13, 2024

మద్యంపై అదనపు ప్రివిలేజ్ ఫీజు విధింపు

image

AP: భారత్‌లో తయారయ్యే విదేశీ మద్యం ధరకు సంబంధించి అదనపు ప్రివిలేజ్ ఫీజు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఫీజు కింద MRPలో చిల్లర కాకుండా తదుపరి పది రూపాయలకు రౌండాఫ్ చేసింది. MRP ₹160.50గా ఉంటే దాన్ని ₹170కి పెంచేలా ఫీజు ఉంటుంది. ప్రభుత్వం క్వార్టర్ బాటిల్ ధర ₹99కే నిర్ధారించడంతో రూ.100లో రూ.1 మినహాయించి విక్రయిస్తారని ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు.

Similar News

News December 6, 2025

‘రైట్ టు డిస్‌కనెక్ట్’.. ఏ దేశాల్లో అమల్లో ఉంది?

image

పని వేళలు పూర్తయ్యాక ఉద్యోగులు ఆఫీస్ కాల్స్‌ను <<18487853>>డిస్ కనెక్ట్<<>> చేసే హక్కును 2017లో ఫ్రాన్స్ చట్టబద్ధం చేసింది. ఆ తర్వాత స్పెయిన్, ఇటలీ, ఐర్లాండ్, బెల్జియం దేశాలు ఈ తరహా చట్టాలను తీసుకొచ్చాయి. ఇది ఉద్యోగుల వర్క్ లైఫ్ బ్యాలెన్స్, మెంటల్ హెల్త్, వారి శ్రేయస్సు, ప్రొడక్టివిటీకి ముఖ్యమని పేర్కొన్నాయి. ఇండియాలోనూ 2018, 2025లో ఇలాంటి ప్రైవేట్ బిల్లులు ప్రవేశపెట్టారు. కానీ చట్టరూపం దాల్చలేదు.

News December 6, 2025

TGపై పవన్ వ్యాఖ్యలు సరికాదు: ఉండవల్లి

image

AP: తెలంగాణపై పవన్ కళ్యాణ్ <<18394542>>దిష్టి<<>> వ్యాఖ్యలు సరికాదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. డిప్యూటీ సీఎం స్థాయి నేత మాట్లాడేటప్పుడు ఆలోచించుకోవాలని హితవు పలికారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు తీసుకొస్తున్న చంద్రబాబు తన వ్యాపారాలను ఏపీకి ఎందుకు తీసుకురావట్లేదని ప్రశ్నించారు. BJP, జనసేన, TDP పొత్తు ఎంతకాలం కొనసాగుతుందో చూడాలన్నారు. మరోవైపు అమరావతి రాజధానికి తాను వ్యతిరేకం కాదన్నారు.

News December 6, 2025

విజయోత్సవాల పేరిట ప్రజాధనం వృథా: హరీశ్

image

TG: కాంగ్రెస్ పాలన రైతుల పాలిట శాపంగా మారిందని BRS నేత హరీశ్ రావు విమర్శించారు. ‘రైతులకు యూరియా సరఫరా చేయలేని రేవంత్.. విజయోత్సవాల పేరిట ప్రజాధనం వృథా చేస్తున్నారు. చేసిందేమీ లేక గప్పాలు కొట్టారు. గ్లోబల్ సమ్మిట్, విజన్ 2047 అంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న CM ముందు యూరియా సరఫరాపై దృష్టి పెట్టాలి. క్యూలైన్లలో రైతులు నరకం చూస్తున్నారు’ అని మండిపడ్డారు.