News October 13, 2024

మద్యంపై అదనపు ప్రివిలేజ్ ఫీజు విధింపు

image

AP: భారత్‌లో తయారయ్యే విదేశీ మద్యం ధరకు సంబంధించి అదనపు ప్రివిలేజ్ ఫీజు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఫీజు కింద MRPలో చిల్లర కాకుండా తదుపరి పది రూపాయలకు రౌండాఫ్ చేసింది. MRP ₹160.50గా ఉంటే దాన్ని ₹170కి పెంచేలా ఫీజు ఉంటుంది. ప్రభుత్వం క్వార్టర్ బాటిల్ ధర ₹99కే నిర్ధారించడంతో రూ.100లో రూ.1 మినహాయించి విక్రయిస్తారని ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు.

Similar News

News November 19, 2025

RRB గ్రూప్-D ఇంటిమేషన్ స్లిప్పులు విడుదల

image

<>RRB<<>> 32,438 గ్రూప్-D పోస్టుల భర్తీకి సంబంధించి ఇంటిమేషన్ స్లిప్పులు విడుదలయ్యాయి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పాస్ వర్డ్ ఎంటర్ చేసి నగర సమాచారాన్ని తెలుసుకోవచ్చు. నవంబర్ 27 నుంచి జనవరి 16వరకు CBT విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. www.rrbcdg.gov.in/ వెబ్‌సైట్ నుంచి అడ్మిట్ కార్డులు ఈనెల 23నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

News November 19, 2025

మావోల ఎన్‌కౌంటర్‌.. మృతుల్లో టెక్ శంకర్

image

AP: ఏజెన్సీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోలు మరణించారని అల్లూరి జిల్లా SP బర్దర్ తెలిపారు. 3రోజులుగా నిర్వహిస్తున్న కూంబింగ్‌లో ఇవాళ తెల్లవారుజామున నక్సల్స్ ఎదురుపడటంతో కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. మృతుల్లో టెక్ శంకర్ ఉన్నారని, ఘటనాస్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. AOBలో మళ్లీ రిక్రూట్‌మెంట్ జరుగుతోందని, దీన్ని షెల్టర్ జోన్‌గా చేసుకోవాలని మావోలు భావించారని తెలిపారు.

News November 19, 2025

కాంగ్రెస్ మేలుకోకపోతే కష్టం: ముంతాజ్

image

బిహార్ ఎన్నికల్లో ఘోర ఓటమిపై INC దివంగత నేత అహ్మద్ పటేల్ కూతురు ముంతాజ్ పటేల్ ఘాటుగా స్పందించారు. ‘30ఏళ్ల కిందట మాదిరిగా ఇప్పుడు పనిచేయలేం. కొత్త ప్రభుత్వాలు, ప్రత్యర్థులను ఎదుర్కొంటున్నాం. సాకులు, నిందలు లేకుండా వాస్తవాలను అంగీకరించాలి. గ్రౌండ్ రియాల్టీ తెలియని కొద్దిమంది చేతుల్లోనే అధికారం కేంద్రీకృతం అవడం వల్లే ఓటములు ఎదురవుతున్నాయి. ఇకనైనా మేలుకొని మార్పులు చేయకపోతే కష్టం’ అని పేర్కొన్నారు.