News August 11, 2024
కాసేపట్లో భూమి సమీపానికి గ్రహ శకలం

ఈరోజు రాత్రి 12గంటల సమయంలో ‘2024 పీకే2’ అనే గ్రహశకలం భూమి సమీపానికి రానుందని నాసా తెలిపింది. గంటకు 31,380 కిలోమీటర్ల వేగంతో అది ప్రయాణిస్తోందని పేర్కొంది. 83 అడుగుల పొడవుతో సుమారు ఓ చిన్న భవనమంతటి సైజులో ఉండే ఆ శకలం, భూమికి 12 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి వెళ్తుందని వివరించింది. తరచూ భూ కక్ష్యలోకి వచ్చే ఆస్టరాయిడ్స్ని అటెన్ గ్రూప్గా పిలుస్తున్నారు. ఇది ఆ గ్రూప్నకే చెందినదిగా నాసా తెలిపింది.
Similar News
News March 1, 2026
ఖమేనీ కుటుంబంలో నలుగురు మృతి!

ఇజ్రాయెల్-అమెరికా దాడుల్లో సుప్రీం లీడర్ ఖమేనీ కుటుంబంలోని నలుగురు చనిపోయినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. ఆయన కూతురు, అల్లుడు, కోడలు, మనవడు చనిపోయినట్లు పేర్కొంది. ఈ జాయింట్ ఆపరేషన్లో ఖమేనీ ఇంటిపై 30 బాంబులు వదిలినట్లు తెలిపింది. ఇందుకోసం ఇజ్రాయెల్ కొన్ని నెలలుగా ప్లాన్ చేస్తోందని, అగ్రనాయకులు అందరూ ఒకే దగ్గర ఉండగా అటాక్ చేసిందని వెల్లడించింది.
News March 1, 2026
ఒక్కరి చావుకు వందల మంది బలి!

ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీని అంతం చేసినట్లు ట్రంప్ ప్రకటన, మీడియా రిపోర్ట్స్ నేపథ్యంలో US తన ప్రధాన లక్ష్యాన్ని పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇజ్రాయెల్తో కలిసి చేస్తున్న ఈ దాడుల్లో కొన్ని వందల అమాయక ప్రాణాలు బలవుతున్నాయి. ఇప్పటివరకు 200 మందికిపైగా చనిపోగా 700 మందికిపైగా గాయపడ్డారు. ఇక మృతుల్లో 85 మంది బాలికలూ ఉన్నారు. మినాబ్ గర్ల్స్ ప్రైమరీ స్కూల్పై జరిగిన దాడిలో వీరు ప్రాణాలు కోల్పోయారు.
News March 1, 2026
రబీ జొన్న పంటలో ఎదుగుదల లోపించిందా?

చలి, ఇతర వాతావరణ పరిస్థితుల కారణంగా రబీలో నాటిన జొన్న పంట ఎదుగుదల కొన్నిచోట్ల లోపించినట్లుగా కనిపిస్తోంది. ఈ సమస్యను అధిగమించడానికి లీటరు నీటికి 19-19-19 మిశ్రమాన్ని 5గ్రాముల చొప్పున కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. అలాగే జొన్న పంటలో ఒకవేళ కత్తెర పురుగును గుర్తిస్తే లీటరు నీటికి క్లోరాంట్రానిప్రోల్ 0.4ml లేదా స్పైనటోరమ్ 0.5ml కలిపి పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.


