News February 6, 2025
ఇండియా గురించి యురోపియన్ మాటల్లో..!

ఏడాది క్రితం ఇండియాకు వచ్చిన యురోపియన్ నిక్హునో తన అభిప్రాయాలు పంచుకున్నారు. ‘ఇక్కడ రైతులు ఎడారుల్లో కూడా పంటలు పండిస్తున్నారు. పేదరికమే ప్రతిభను పెంచుతుంది. INDలో ఎలాంటి పని అయినా పవిత్రమే. ఇక్కడ డబ్బు ఉన్నా లేకున్నా ఒకే గౌరవం ఉంది. భాషలు వేరైనా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. నదులను, ప్రకృతిని గౌరవిస్తారు. నిజాయితీ గలవారిని గౌరవిస్తారు. అజ్ఞాత వ్యక్తి కష్టాల్లో ఉన్నా తోడుగా ఉంటారు’ అని తెలిపారు.
Similar News
News November 27, 2025
NIT వరంగల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు

<
News November 27, 2025
పంచాయతీ ఎన్నికలు.. జీవో నం.46 అంటే ఏంటి?

TG: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 22న జీవో నం.46ను తీసుకొచ్చింది. దీని ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కలిపి గరిష్ఠంగా 50 శాతం మించకూడదు. దీని ప్రకారం బీసీలకు 22% రిజర్వేషన్లు మాత్రమే దక్కుతాయని బీసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ జీవోను <<18402975>>సవాల్ చేస్తూ హైకోర్టులో<<>> పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై రేపు విచారణ జరగనుంది.
News November 27, 2025
పవిత్ర పంబా నది విశేషాలు మీకు తెలుసా?

పంబా నది ప్రస్తావన త్రేతాయుగం నుంచి ఉంది. అందుకే పవిత్ర నదిగా దీన్ని పరిగణిస్తారు. ఇది ఔషధ మూలికల సారంతో ప్రవహిస్తుందని నమ్ముతారు. ఈ నదిలో స్నానం చేస్తే వన యాత్ర అలసట మాయమవుతుందట. యాత్రలో భాగంగా స్వాములు ఇక్కడ స్నానమచారిస్తుంటారు. ఇక్కడ పితృకర్మలు నిర్వహిస్తే 7 తరాల వారికి మోక్షం లభిస్తుందని చెబుతారు. ఇక్కడ కొలువైన కన్నెమూల మహా గణపతిని దర్శించి యాత్రను కొనసాగిస్తారు. <<-se>>#AyyappaMala<<>>


