News February 6, 2025
ఇండియా గురించి యురోపియన్ మాటల్లో..!

ఏడాది క్రితం ఇండియాకు వచ్చిన యురోపియన్ నిక్హునో తన అభిప్రాయాలు పంచుకున్నారు. ‘ఇక్కడ రైతులు ఎడారుల్లో కూడా పంటలు పండిస్తున్నారు. పేదరికమే ప్రతిభను పెంచుతుంది. INDలో ఎలాంటి పని అయినా పవిత్రమే. ఇక్కడ డబ్బు ఉన్నా లేకున్నా ఒకే గౌరవం ఉంది. భాషలు వేరైనా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. నదులను, ప్రకృతిని గౌరవిస్తారు. నిజాయితీ గలవారిని గౌరవిస్తారు. అజ్ఞాత వ్యక్తి కష్టాల్లో ఉన్నా తోడుగా ఉంటారు’ అని తెలిపారు.
Similar News
News January 14, 2026
డెయిరీఫామ్.. ఈ ఏడాది రూ.3 కోట్ల ఆదాయం లక్ష్యం

గుజరాత్లోని బనస్కాంతకు చెందిన 65 ఏళ్ల మణిబెన్ పాల వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తున్నారు. 2011లో 12 ఆవులతో డెయిరీ ఫామ్ ప్రారంభించారు. ప్రస్తుతం ఫామ్లో 230 ఆవులు, గేదెలున్నాయి. రోజూ 1100 లీటర్లను గ్రామ కోఆపరేటివ్ డెయిరీకి సరఫరా చేస్తూ 2024-25లో 3.47లక్షల లీటర్ల పాలు అమ్మి రూ.1.94 కోట్ల ఆదాయం పొందారు. ఈ ఏడాది రూ.3 కోట్ల ఆదాయమే లక్ష్యమంటున్నారు. ఈమె సక్సెస్ స్టోరీ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News January 14, 2026
వినాశకర పరిణామాలుంటాయ్.. అమెరికాకు రష్యా పరోక్ష హెచ్చరిక

ఇరాన్లో అమెరికా జోక్యం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని రష్యా తెలిపింది. ‘2025 జూన్లో ఇరాన్పై చేసిన దాడిని రిపీట్ చేయాలనుకునేవారు, బయటి శక్తుల ప్రేరేపిత అశాంతిని వాడుకోవాలనుకునేవారు.. అటువంటి చర్యల వల్ల మిడిల్ఈస్ట్లో పరిస్థితులపై, అంతర్జాతీయ భద్రతపై ఉండే వినాశకరమైన పరిణామాల పట్ల అలర్ట్గా ఉండాలి’ అంటూ పరోక్షంగా హెచ్చరించింది. అంతకుముందు ఇరాన్ నిరసనకారులకు సాయం అందబోతోందని ట్రంప్ ప్రకటించారు.
News January 14, 2026
టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

సికింద్రాబాద్, RKపురంలోని <


