News December 28, 2024
ఉదయపు పలకరింపై, ఊరు ప్రశ్నించే గొంతుకై

Way2News.. తొమ్మిదేళ్ల క్రితం వేల మంది యూజర్లతో ప్రారంభమై నేడు కోట్లాది తెలుగు వారికి చేరువైంది. ఉదయమే అందరికీ పలకరింపుగా, ప్రతి ఊరు తరఫున ప్రశ్నించే గొంతుగా మారడం ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. ప్రజలకు వేగంగా, సులువుగా సమాచారం అందించాలనే మా ఆశయానికి మీ ఆశీర్వాదం తోడవడంతోనే ఈ విజయయాత్ర సాధ్యమైంది. మనమంతా వార్తా ప్రపంచంలో కొత్త గమ్యాలు చేరేందుకు ఇలాగే సహకరిస్తారని ఆశిస్తూ.. కృతజ్ఞతలు!
-Team Way2News
Similar News
News July 11, 2025
శ్రీశైలం నీళ్లు ఎలా వాడుకుంటారో తెలుసా?

శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్ నుంచి రాయలసీమ, తెలంగాణకు నీరందుతోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 44వేల క్యూసెక్కులను రాయలసీమకు తరలించొచ్చు. తెలుగు గంగ, గాలేరు-నగరి కాలువల ద్వారా కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలకు నీరందుతోంది. హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకంతో అనంతపురం, చిత్తూరుకు నీరు వెళ్తోంది. అటు తెలంగాణ కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల ద్వారా లబ్ధి పొందుతోంది.
News July 11, 2025
ఇలా చేస్తే మీ ఆధార్ వివరాలు సేఫ్: UIDAI

ఆధార్ సమాచారం దుర్వినియోగం కాకుండా కాపాడుకునేందుకు బయోమెట్రిక్ లాక్ చేసుకోవాలని UIDAI పేర్కొంది. దీనికోసం <
News July 11, 2025
జగన్ పర్యటన.. మొత్తం నాలుగు కేసులు నమోదు

AP: YS జగన్ చిత్తూరు(D) బంగారుపాళ్యం పర్యటనపై తాజాగా మరో కేసు నమోదైంది. అనుమతి లేకున్నా రోడ్షో చేపట్టారని పోలీసులు కేసు నమోదు చేశారు. పరిమితికి మించి జన సమీకరణ చేపట్టారని, రోడ్డుపై మామిడికాయలు పారబోసి షరతులు ఉల్లంఘించారని, ఫొటోగ్రాఫర్పై జరిగిన దాడి ఘటనపై 3 వేర్వేరు కేసులు పెట్టారు. CC ఫుటేజ్, వీడియోలను పరిశీలిస్తున్న పోలీసులు మరికొందరిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.