News May 10, 2024

లార్డ్స్ స్టేడియంలో సీటింగ్ సామర్థ్యం పెంపు

image

అత్యంత పురాతనమైన లండన్‌లోని సెయింట్ జాన్స్ వుడ్‌లోని లార్డ్స్ స్టేడియం సరికొత్త హంగులతో అందుబాటులోకి రానుంది. ఈ గ్రౌండ్ సీటింగ్ సామర్థ్యాన్ని మరో 1100 సీట్లకు పెంచేందుకు మెరైల్‌బోన్ క్రికెట్ క్లబ్ (MCC)కు చెందిన 18000 మంది ఆమోదించారు. 61.8 మిలియన్ పౌండ్ల ప్రాజెక్టులో భాగంగా 1930లో నిర్మించిన టావెర్న్ & అలెన్ స్టాండ్స్‌ను అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుతం లార్డ్స్‌లో 31,180 సీటింగ్ కెపాసిటీ ఉంది.

Similar News

News February 20, 2025

‘శంభాజీ’పై నటి వివాదాస్పద వ్యాఖ్యలు.. నెటిజన్లు ఫైర్

image

‘ఛావా’లో శంభాజీని ఔరంగజేబు చిత్రహింసలు పెట్టిన సన్నివేశం చరిత్రలో జరగలేదంటూ నటి స్వరభాస్కర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. చరిత్ర తెలుసుకుని మాట్లాడాలంటూ ఆమెపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ‘నేను ఢిల్లీ యూనివర్సిటీలో చరిత్ర చదువుకున్నాను. సినిమాలో చూపించిన హింసలో ఏమాత్రం కల్పితం లేదు’ అని ఒకరు పేర్కొనగా.. ‘శంభాజీ త్యాగాన్ని చులకన చేయడానికి నీకెంత ధైర్యం’ అంటూ మరో నెటిజన్ ప్రశ్నించారు.

News February 20, 2025

మహా కుంభమేళాను వాడుతున్న సినీ మేకర్స్

image

మహా కుంభమేళా సినీజనానికి మంచి అవకాశంగా మారింది. ఇప్పటికే బాలయ్య ‘అఖండ-2’కి కొంత షూటింగ్‌ను కుంభమేళాలో తీసినట్లు సమాచారం. తాజాగా తమన్నా నాగ సాధువుగా నటిస్తున్న ‘ఓదెల-2’ ప్రమోషన్లకి కూడా కుంభమేళా వేదికగా మారింది. మూవీ టీజర్‌ను ఈ నెల 22న అక్కడే లాంఛ్ చేయనున్నట్లు వారు ఇప్పటికే ప్రకటించారు. దీంతో అటు భక్తితో పాటు ఇటు సినిమా పనిని కూడా మూవీ టీమ్స్ చక్కదిద్దుకుంటున్నాయన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

News February 20, 2025

భారత్‌లోకి ఐఫోన్ 16ఈ.. ధర ఎంతంటే..

image

భారత్‌లో తమ మార్కెట్‌ను విస్తరించడంపై యాపిల్ కన్నేసింది. రూ.59వేలకే ఐఫోన్ 16ఈని తీసుకొస్తోంది. ఇది 128 జీబీ ఇంటర్నల్ జీబీతో రానుంది. రేపటి నుంచే అడ్వాన్స్ సేల్స్ ప్రారంభం కానున్నాయి. ఈ నెల 28 నుంచి పూర్తి స్థాయి అమ్మకాలు మొదలవుతాయని యాపిల్ తెలిపింది. ఈ ఫోన్‌లో సింగిల్ కెమెరా మాత్రమే ఉండటం గమనార్హం. ఇక ఐఫోన్ SE అమ్మకాల్ని యాపిల్ భారత్‌లో ఆపేయనున్నట్లు సమాచారం.

error: Content is protected !!