News November 19, 2024
IND-CHINA: మానసరోవర్ యాత్ర, డైరెక్ట్ ఫ్లైట్స్పై చర్చ

కరోనా, ఆ తర్వాత తూర్పు లద్దాక్లో ఘర్షణల కారణంగా భారత్-చైనా మధ్య 2020 నుంచి డైరెక్ట్ విమాన సర్వీసులు ఆగిపోయాయి. ప్రస్తుతం ఆ విషయంలో పురోగతి కనిపిస్తోంది. జీ20 సమ్మిట్లో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు జైశంకర్, వాంగ్ యీ <<14650227>>భేటీలో<<>> విమానాల పునరుద్ధరణపై చర్చ జరిగింది. అలాగే చైనా సరిహద్దుల మీదుగా సాగే కైలాష్ మానసరోవర్ యాత్ర ప్రారంభంపైనా సానుకూల డిస్కషన్ జరిగింది.
Similar News
News January 1, 2026
విషపు నీళ్లు!

దాహం తీర్చాల్సిన నీళ్లే విషమై ప్రాణం తీసిన <<18729199>>ఘటన<<>> యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. MP ఇండోర్లో నీళ్లు కలుషితమై 6 నెలల పసికందు సహా 10 మంది మరణించడం వెనుక యంత్రాంగం నిర్లక్ష్యం కళ్లకు కడుతోంది. తాగునీటి పైప్లైన్లో మురికినీరు ఎక్కడ కలుస్తుందో మున్సిపల్ అధికారులు ఇప్పటికీ కనుక్కోలేకపోవడం వారి చేతగానితనానికి నిదర్శనం. 10 రోజులైనా బాధిత ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించలేని దౌర్భాగ్యం.
News January 1, 2026
టెంపో డ్రైవర్ టు శంఖ్ ఎయిర్లైన్స్ ఓనర్..

UP కాన్పూర్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించిన శ్రవణ్ కుమార్ విశ్వకర్మ నేడు శంఖ్ ఎయిర్లైన్స్కు ఓనర్ అయ్యారు. టెంపో నడుపుతూ చిన్న వ్యాపారాలు చేసి నష్టపోయిన శ్రవణ్.. 2014లో సిమెంట్ ట్రేడింగ్లో సక్సెస్ కావడంతో మైనింగ్, ట్రాన్స్పోర్ట్ బిజినెస్లోకి దిగారు. భారత్లో ప్రారంభం కానున్న 4 కొత్త ఎయిర్లైన్స్లో శంఖ్ ఒకటి. సామాన్యులు విమానాల్లో ప్రయాణించేలా చేయడమే లక్ష్యమని చెబుతున్నారు శ్రవణ్.
News January 1, 2026
KCRను కసబ్తో పోలుస్తావా? రేవంత్పై హరీశ్రావు ఫైర్

TG: కేసీఆర్, హరీశ్ రావుకు ఉరేసినా తప్పులేదని సీఎం రేవంత్ <<18735382>>వ్యాఖ్యానించడంపై<<>> హరీశ్ రావు ఫైరయ్యారు. ‘తెలంగాణను సాధించిన మహనీయుడిని కసబ్తో పోల్చిన నీకు సంస్కారం, మర్యాద అనే పదాలకు అర్థం కూడా తెలియదు. సభకు వస్తే KCRను అవమానించబోమని చెబుతూనే కసబ్తో పోల్చుతావా?’ అని మండిపడ్డారు. రేవంత్కు బచావత్ ట్రిబ్యునల్కు, బ్రిజేష్ ట్రిబ్యునల్కు తేడా తెలియదన్న విషయం ఈరోజు వెల్లడైందని పేర్కొన్నారు.


