News January 22, 2025

IND-ENG మ్యాచ్.. పిచ్ రిపోర్ట్

image

ఇవాళ భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టీ20 జరిగే కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించనుంది. బౌండరీ చిన్నగా ఉండటంతో పరుగుల వరద పారనుంది. వాతావరణం విషయానికొస్తే రాత్రి పొగమంచు కురుస్తుంది. దీనివల్ల బంతి త్వరగా తడిగా మారి బౌలర్లకు ఇబ్బందిగా మారే ఛాన్స్ ఉంది. ఇది బ్యాటర్లకు ప్లస్ కానుంది. ఇక ఈడెన్ గార్డెన్స్ వద్ద వర్షం కురిసే అవకాశం లేదని అక్కడి వాతావరణ కేంద్రం తెలిపింది.

Similar News

News December 10, 2025

ఎండినవారికి ఇనుము తిండి

image

తీవ్రమైన ఆకలితో శరీరం బలహీనంగా, ఎండిపోయి ఉన్న వ్యక్తికి ఇనుము ముక్కలను ఆహారంగా ఇస్తే ఎలా ఉంటుంది? ఇనుము తినడానికి పనికిరాదు, అది వారికి బలం ఇవ్వదు సరికదా, ప్రాణం పోయే ప్రమాదం ఉంది. ఏదైనా ఒక సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు దానికి ఉపశమనం కలిగించే పరిష్కారాన్ని సూచించాలి, అంతే తప్ప ఆ పరిస్థితిని మరింత దిగజార్చే పరిష్కారాన్ని సూచించకూడదని తెలిపే సందర్భంలో ఈ సామెత వాడతారు.

News December 10, 2025

గణపతి స్తోత్రాన్ని ఎప్పుడు పఠించడం ఉత్తమం?

image

వినాయకుడి స్తోత్రాలు పఠించడానికి బుధవారం ఉత్తమ దినమని పండితులు చెబుతున్నారు. శుభ దినాలప్పుడు కూడా ప్రారంభించవచ్చని, సంకష్టహర చతుర్థి రోజున మొదలుపెట్టడం మరింత మేలని అంటున్నారు. ‘ప్రారంభించిన తర్వాత రోజూ పఠించడం చాలా ముఖ్యం. ఉదయాన్నే స్నానం చేసి, శుచిగా దీపారాధన చేసి, గణేశునికి కొంచెం గరిక, నైవేద్యాన్ని సమర్పించి స్తోత్రాన్ని పఠించాలి. చివరగా హారతి ఇచ్చి నమస్కరించుకోవాలి’ అని సూచిస్తున్నారు.

News December 10, 2025

నేటి నుంచి TET పరీక్షలు

image

AP: ఉపాధ్యాయ అర్హత పరీక్షలు (TET) నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. మొత్తం 2,71,692 మంది దరఖాస్తు చేసుకోగా 96.25% మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఈ నెల 21 వరకు రోజుకు 2 సెషన్లలో 9.30AM నుంచి 12PM, 2.30PM నుంచి 5PM వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో 133 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు తెలిపారు.