News September 23, 2024
చైనా దూకుడుకు కళ్లెమేసే డిఫెన్స్ డీల్కు IND, US ఓకే

31 MQ-9B ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుకు సిద్ధమైన భారత్ను అమెరికా స్వాగతించింది. $3.9 బిలియన్ల విలువైన ఈ అగ్రిమెంట్పై అక్టోబర్ లోపు 2 దేశాలూ సంతకాలు చేస్తాయని అంచనా. అధునాతన ఆయుధ వ్యవస్థల కో-ప్రొడక్షన్, ఇంటెలిజెన్స్, టెక్నాలజీ షేరింగ్ ఇందులో భాగం. చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు వీటిని వాడతారని తెలిసింది. నేవీకి 15 సీ గార్డియన్స్, ఆర్మీ, ఎయిర్ఫోర్స్కు 16 స్కై గార్డియన్స్ డ్రోన్లు అందిస్తారు.
Similar News
News September 18, 2025
జనరేషన్-Zపై రాహుల్ ట్వీట్.. అర్థమదేనా?

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాజాగా చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ‘ఈ దేశంలోని యువత, విద్యార్థులు, జనరేషన్-Z రాజ్యాంగాన్ని కాపాడతారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారు. ఓట్ల చోరీని ఆపుతారు. నేను వారి వెంటే నిలబడతాను. జైహింద్’ అని రాసుకొచ్చారు. అయితే నేపాల్ తరహాలో భారత్లోనూ జనరేషన్-Z ఉద్యమం వస్తుందన్న కోణంలో రాహుల్ ట్వీట్ ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనిపై మీరేమంటారు?
News September 18, 2025
ఇకపై మరింత సులభంగా EPFO సేవలు

EPFO <
News September 18, 2025
నాడు మండలి రద్దుకు తీర్మానం.. నేడు అదే కీలకమని వ్యాఖ్యలు!

AP: బిల్లులను అడ్డుకుంటోందంటూ శాసనమండలి రద్దుకు నాటి జగన్ ప్రభుత్వం తీర్మానించి తర్వాత వెనక్కి తీసుకుంది. నేడు అదే మండలిపై జగన్ చేసిన <<17752308>>వ్యాఖ్యలు<<>> వైరలవుతున్నాయి. అసెంబ్లీలో ప్రతిపక్షహోదా ఇవ్వట్లేదని, మండలి సభ్యులే బలంగా పోరాడాలని అన్నారు. మండలి చాలా కీలకమని వ్యాఖ్యానించారు. అయితే అధికారంలో ఒకలా, ఇప్పుడు మరోలా మాట్లాడటం చర్చనీయాంశమవుతోంది.