News April 15, 2024

ఆచితూచి వ్యవహరించిన భారత్

image

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతపై భారత్ ఆచితూచి వ్యవహరించింది. గత ఏడాది అక్టోబరు 7న హమాస్ దాడి చేసినప్పుడు భారత్ ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చింది. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్‌కు గొడవ ఇరాన్‌తో కావడంతో భారత్ అప్రమత్తమైంది. మిడిల్‌ ఈస్ట్‌లో ఇరాన్ కీలక దేశం కావడం, ఆ ప్రాంతంలోని దేశాలతో భారత్ సత్సంబంధాలు కోరుకోవడమే ఇందుకు కారణం. అందుకే చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని ఇరాన్-ఇజ్రాయెల్‌కు భారత్ సూచించింది.

Similar News

News March 23, 2026

ఎక్స్‌ఛేంజ్ ట్రెండ్‌లో హైదరాబాద్ టాప్

image

పాడైన వస్తువులను మరమ్మతు చేసుకునే సంస్కృతి క్షీణిస్తోంది. కొత్తవి కొనుగోలు చేసే ధోరణి నగరవాసుల్లో వేగంగా పెరుగుతోందని టాక్సిక్స్ లింక్ అధ్యయనం వెల్లడించింది. ఇందులో దేశంలోని ప్రధాన నగరాల్లో HYD అగ్రస్థానంలో నిలిచింది. అన్ని ఆదాయ వర్గాల్లోనూ ‘రీప్లేస్మెంట్ ట్రెండ్’ స్పష్టంగా ప్రాబల్యం సాధించినట్లు తేలింది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల విషయంలో మార్పిడి అధికంగా ఉన్నట్లు నిర్ధారించింది.

News March 23, 2026

ప్రధాని మోదీకి జగన్ శుభాకాంక్షలు

image

AP: అత్యధిక రోజులు సేవలు అందించిన ప్రభుత్వాధినేతగా (8,931 రోజులు) ప్రధాని మోదీ రికార్డ్ నెలకొల్పిన నేపథ్యంలో వైసీపీ చీఫ్ జగన్ Xలో శుభాకాంక్షలు తెలిపారు. ఈ మైలురాయి ఆయనకు ఉన్న పట్టుదల, నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యంగా ఉండి దేశానికి ఇలాగే సేవ చేయాలని కోరుకున్నారు. కాగా సీఎం చంద్రబాబు, Dy.CM పవన్, మంత్రి లోకేశ్ కూడా ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.

News March 23, 2026

ఇళ్లు లేని పేదలకు శుభవార్త

image

AP: రాష్ట్రవ్యాప్తంగా మరో 2.50 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. వీటిలో కాలనీల్లో చేపట్టిన 1.42 లక్షల గృహాలు, 1.08 లక్షల టిడ్కో ఇళ్లు ఉన్నాయి. ఈ నెల 30న తిరుపతి జిల్లా నాయుడుపేటలో సీఎం చంద్రబాబు సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించనున్నారు. అనంతరం గత ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్లకు డబ్బులు కట్టినా ఫ్లాట్ కేటాయింపులు జరగని వారి ఖాతాల్లో <<19421760>>రూ.174 కోట్లను<<>> జమ చేయనున్నట్లు సమాచారం.