News January 9, 2025

INDIA కూటమి కేవలం లోక్‌సభ ఎన్నికల కోసమే: కాంగ్రెస్

image

ఇండియా కూట‌మి కేవ‌లం లోక్‌స‌భ ఎన్నిక‌ల కోసం ఏర్పాటైంది త‌ప్ప, అసెంబ్లీ ఎన్నిక‌లకు ఉద్దేశించిన‌ది కాద‌ని కాంగ్రెస్ స్ప‌ష్టం చేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో INDIA మిత్ర‌ప‌క్షాలు ఆప్‌న‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తూ కాంగ్రెస్‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డంతో కూట‌మి కుదేలైన‌ట్టే అనే విమ‌ర్శ‌లు వినిపించాయి. ఢిల్లీలో పార్టీకి ఏళ్లుగా ఉన్న ప‌ట్టు వ‌ల్ల‌ ఒంటరిగా బ‌రిలో దిగాలని కోరుకుంటున్నట్టు INC పేర్కొంది.

Similar News

News December 3, 2025

‘ది రాజా సాబ్’ రన్ టైమ్ 3గంటలు ఉండనుందా?

image

రెబల్ స్టార్ ప్రభాస్-డైరెక్టర్ మారుతీ కాంబోలో వస్తున్న ‘ది రాజా సాబ్’ మూవీ రన్ టైమ్‌పై SMలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ మూవీకి అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అక్కడి టికెట్ బుకింగ్ యాప్స్‌లో రన్ టైమ్ 3.15 గంటలు ఉన్నట్లు కొన్ని స్క్రీన్ షాట్స్ వైరలవుతున్నాయి. భారత్‌లోనూ దాదాపుగా ఇదే రన్ టైమ్ ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. జనవరి 9న ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా విడుదలకానుంది.

News December 2, 2025

DEC 9 అర్ధరాత్రి నుంచి రవాణా వాహనాల బంద్

image

రవాణా వాహనాలకు కేంద్రం ఫిట్‌నెస్ <<18321648>>ఛార్జీలు<<>> పెంచడంపై సౌత్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్(SIMTA) కీలక నిర్ణయం తీసుకుంది. DEC 9 అర్ధరాత్రి నుంచి రవాణా వాహనాల బంద్ పాటించనున్నట్లు ప్రకటించింది. AP, TN, TG, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరికి చెందిన 12 ఏళ్లు పైబడిన వాహన యజమానులు ఇందులో పాల్గొంటారని పేర్కొంది. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేవరకు బంద్ కొనసాగుతుందని తెలిపింది.

News December 2, 2025

రేపు ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ

image

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఆయన ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. పార్లమెంట్‌ భవనంలోనే పీఎంతో సమావేశమై తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానించనున్నారు. అలాగే పలువురు కేంద్రమంత్రులను సైతం రేవంత్ కలిసి సదస్సుకు ఇన్వైట్ చేయనున్నారు.