News January 25, 2025

నేడే భారత్, ఇంగ్లండ్ రెండో T20

image

భారత్, ఇంగ్లండ్ మధ్య చెన్నైలో ఇవాళ రెండో T20 జరగనుంది. కోల్‌కతాలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ గెలిచి సిరీస్ 1-0తో ఆధిక్యంలో నిలిచిన విషయం తెలిసిందే. నిన్న ప్రాక్ట్రీస్‌లో గాయపడిన అభిషేక్‌శర్మ మ్యాచ్‌కు దూరమైతే ధ్రువ్‌ జురెల్ జట్టులో చేరొచ్చు. అటు, షమీ ఫిట్‌నెస్‌పై సస్పెన్స్ కొనసాగుతుండగా నేడు మ్యాచ్ ఆడతారో? లేదో? వేచి చూడాలి. రాత్రి 7గంటలకు స్టార్‌ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో మ్యాచ్ LIVE చూడొచ్చు.

Similar News

News November 24, 2025

TODAY HEADLINES

image

* వ్యవసాయ నిధి ఏర్పాటు అత్యవసరం: మోదీ
* సింధ్ మళ్లీ INDలో కలవొచ్చు: రాజ్‌నాథ్
* AP: తీవ్ర అల్పపీడనం.. పలు జిల్లాల్లో వర్షాలు
* సత్యసాయి సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలి: CBN
* బాబా ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకోవాలి: రేవంత్
* ‘రైతన్నా.. మీకోసం’ పబ్లిసిటీ స్టంటే: జగన్
* అవసరమైతే తిరిగి రాజకీయాల్లోకి వస్తా: VSR
* రేషన్‌కార్డు ఉన్న మహిళలకు ఫ్రీగా చీరలు: పొన్నం
* SAతో ODI సిరీస్‌కు కెప్టెన్‌గా కేఎల్

News November 24, 2025

ప్రభాస్ ఫొటో జేబులో పెట్టుకున్నా: మారుతి

image

ప్రభాస్ ఫొటో జేబులో పెట్టుకొని పనిచేశానని, ఆయన ఫొటో ఉంటే ఎవరైనా టాప్ డైరెక్టర్ అయిపోతారని మారుతి అన్నారు. ‘రాజా‌సాబ్’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ సందర్భంగా మాట్లాడారు. ‘ఫ్యాన్స్ కోసమే ప్రభాస్ <<18369126>>ఈ పాట <<>>చేశారు. కేరింతలతో థియేటర్స్ రీసౌండ్ వస్తాయి. ముగ్గురు హీరోయిన్స్‌తో ఆయన కెమిస్ట్రీ స్క్రీన్‌పై చూడాలి. రిలీజ్‌కు ముందే అందరూ రెబల్ ఆరాలో ఉంటారు. ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకునే వర్క్ చేస్తున్నా’ అని చెప్పారు.

News November 24, 2025

జపాన్ రెడ్ లైన్ క్రాస్ చేసింది: చైనా

image

తైవాన్‌పై చైనా కవ్వింపు చర్యలకు పాల్పడితే సైనిక జోక్యానికి జపాన్ వెనుకాడబోదని ప్రధాని సనై తకాయిచి చేసిన వ్యాఖ్యలపై డ్రాగన్ దేశం మండిపడింది. ఈ కామెంట్లతో జపాన్ రెడ్ లైన్‌ క్రాస్ చేసిందని చైనా మినిస్టర్ వాంగ్ యీ అన్నారు. జపాన్ సైనికవాదం పెరగకుండా నిరోధించాల్సిన బాధ్యత అన్ని దేశాలపై ఉందని చెప్పారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించేలా తకాయిచి కామెంట్లు ఉన్నాయంటూ UNకు రాసిన లెటర్‌లో చైనా పేర్కొంది.