News January 25, 2025

నేడే భారత్, ఇంగ్లండ్ రెండో T20

image

భారత్, ఇంగ్లండ్ మధ్య చెన్నైలో ఇవాళ రెండో T20 జరగనుంది. కోల్‌కతాలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ గెలిచి సిరీస్ 1-0తో ఆధిక్యంలో నిలిచిన విషయం తెలిసిందే. నిన్న ప్రాక్ట్రీస్‌లో గాయపడిన అభిషేక్‌శర్మ మ్యాచ్‌కు దూరమైతే ధ్రువ్‌ జురెల్ జట్టులో చేరొచ్చు. అటు, షమీ ఫిట్‌నెస్‌పై సస్పెన్స్ కొనసాగుతుండగా నేడు మ్యాచ్ ఆడతారో? లేదో? వేచి చూడాలి. రాత్రి 7గంటలకు స్టార్‌ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో మ్యాచ్ LIVE చూడొచ్చు.

Similar News

News February 11, 2025

ఏ బీరుపై ఎంత రేటు పెరిగిందంటే?

image

TG: రాష్ట్రంలో బీర్ల ధరలు ఇవాళ్టి నుంచి 15% పెరిగాయి. KF స్ట్రాంగ్ రేటు రూ.160 నుంచి రూ.184కు, లైట్ రూ.150 నుంచి రూ.172కు, అల్ట్రా మాక్స్ రూ.220 నుంచి రూ.253కు చేరాయి. అలాగే బడ్వైజర్ లైట్ రూ.210 నుంచి రూ.241కు, మ్యాగ్నం రూ.220 నుంచి రూ.253కు, టుబర్గ్ స్ట్రాంగ్ రూ.240 నుంచి రూ.276కు పెరిగాయి. ఈ పెంపుతో ప్రభుత్వానికి రూ.700 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా.

News February 11, 2025

ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడు కోహ్లీనే: గేల్

image

ప్రస్తుతం ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడు విరాట్ కోహ్లీయేనని వెస్టిండీస్ మాజీ క్రికెటర్ క్రిస్ గేల్ అభిప్రాయపడ్డారు. రికార్డులే ఆ మాట చెబుతాయని ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ‘ఫార్మాట్లతో సంబంధం లేకుండా ఇప్పటికీ విరాటే అత్యుత్తమ ఆటగాడు. ఆయన ఫామ్ కొంచెం డౌన్ అయిందంతే. తిరిగి పుంజుకుని కెరీర్‌ను బలంగా ముగిస్తారని అనుకుంటున్నా. ఇక రోహిత్ అద్భుతమైన ఎంటర్‌టైనర్. సిక్సుల్లో ఆయనే ఇప్పుడు కింగ్’ అని కొనియాడారు.

News February 11, 2025

రంగరాజన్‌పై దాడిని ఖండించిన చంద్రబాబు

image

AP: చిలుకూరి బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడిని సీఎం చంద్రబాబు ఖండించారు. నాగరిక సమాజంలో హింసకు తావులేదని హితవు పలికారు. గౌరవప్రదమైన చర్చలు, భిన్నాభిప్రాయాలకు స్థానం ఉండాలి కానీ హింసకు కాదని వ్యాఖ్యానించారు. కాగా ఇటీవల రంగరాజన్‌పై దాడిని టీజీ సీఎం రేవంత్, కేటీఆర్, పవన్ కళ్యాణ్ తదితర రాజకీయ ప్రముఖులు ఖండించిన విషయం తెలిసిందే.

error: Content is protected !!