News October 31, 2024
‘భారత్-చైనా’ విమాన సర్వీసులు.. డ్రాగన్ రాయబారి ఏమన్నారంటే?

తూర్పు లద్దాక్లో బలగాల ఉపసంహరణ కొలిక్కి రావడంపై భారత్లోని చైనా రాయబారి షు ఫీహాంగ్ స్పందించారు. ఈ పరిణామం ఇరుదేశాల సంబంధాలను సులభతరం, బలోపేతం చేస్తుందని చెప్పారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా మోదీ-జిన్పింగ్లు ముఖ్యమైన అంశాలపై అవగాహనకు వచ్చారని తెలిపారు. ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసుల పునరుద్ధరణ కోసం తాను ఎదురుచూస్తున్నానన్నారు. దీనివల్ల సమయం ఆదా అవుతుందని పేర్కొన్నారు.
Similar News
News December 4, 2025
ఫిబ్రవరిలో పెళ్లి అని ప్రచారం.. స్పందించిన రష్మిక

నటి రష్మిక మందన్న-విజయ్ దేవరకొండ పెళ్లి వార్తలు కొంతకాలంగా వైరల్ అవుతూనే ఉన్నాయి. 2026 ఫిబ్రవరిలో రాజస్థాన్లో పెళ్లి జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ‘వివాహాన్ని నేను ధ్రువీకరించను. అలాగని ఖండించను. సమయం వచ్చినప్పుడు మాట్లాడతా. అంతకుమించి ఏమీ చెప్పను’ అని ప్రశాంతంగా సమాధానం ఇచ్చారు.
News December 4, 2025
APPLY NOW: BEMLలో ఉద్యోగాలు

భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(<
News December 4, 2025
‘హిల్ట్’ లీకేజ్.. ఇద్దరు ఉన్నతాధికారులపై అనుమానం!

TG: <<18457165>>హిల్ట్<<>> పాలసీ లీకేజీపై విజిలెన్స్ టీమ్ విచారణ వేగవంతం చేసింది. ఈ లీక్ వెనుక ఇద్దరు ఉన్నతాధికారులు ఉన్నారని అనుమానిస్తోంది. సీఎంఓలోని ఓ అధికారిని నిన్న రాత్రి టీమ్ విచారించినట్లు తెలుస్తోంది. అటు BRSతో పాటు ఓ కీలక బీజేపీ నేతకు కూడా సమాచారం లీక్ అయినట్లు టాక్. ఉన్నతాధికారుల ప్రమేయంపై క్లారిటీ రావాల్సి ఉంది. CM ఈ విషయమై సీరియస్గా ఉండటంతో క్లారిటీ వస్తే కారకులకు షోకాజ్ నోటీస్ ఇచ్చే అవకాశముంది.


