News December 22, 2024
వన్డే సిరీస్పై కన్నేసిన భారత్
విండీస్పై టీ20 సిరీస్ గెలిచిన జోరుమీదున్న భారత మహిళల జట్టు వన్డే సిరీస్పై కన్నేసింది. నేడు కరేబియన్ జట్టుతో తొలి వన్డేలో తలపడనుంది. బ్యాటింగ్లో హర్మన్ప్రీత్, స్మృతి, జెమీమా, రిచా, బౌలింగులో దీప్తి, రేణుక, సైమా నిలకడగా రాణిస్తుండటం టీమ్ ఇండియాకు కలిసొచ్చే అంశాలు. మరోవైపు వన్డేల్లోనైనా గెలవాలని విండీస్ పట్టుదలతో ఉంది. మ.1.30 నుంచి స్పోర్ట్స్-18లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు.
Similar News
News January 18, 2025
‘డాకు మహారాజ్’ కలెక్షన్లు @రూ.124+కోట్లు
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కించిన ‘డాకు మహారాజ్’ చిత్రం కలెక్షన్లు భారీగా రాబడుతోంది. ఈ చిత్రానికి ఆరు రోజుల్లోనే రూ.124+కోట్లు (గ్రాస్) వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. ‘బ్లాక్ బస్టర్.. కింగ్ ఆఫ్ సంక్రాంతి’ అంటూ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. నేడు, రేపు వీకెండ్స్ కావడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని సినీవర్గాలు పేర్కొన్నాయి.
News January 18, 2025
ఈ నెలాఖరు నుంచి అల్లు అర్జున్ కొత్త మూవీ షురూ?
పుష్ప-2 హిట్తో జోష్ మీదున్న అల్లు అర్జున్ కొత్త ప్రాజెక్టుపై దృష్టిసారించారు. త్రివిక్రమ్ డైరెక్షన్లో చేయనున్న మూవీ ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. బన్నీ న్యూలుక్తో ఓ స్పెషల్ అనౌన్స్మెంట్ వీడియోను రిలీజ్ చేస్తారని టాక్. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తారని తెలుస్తోంది. వీరి కాంబోలో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే.
News January 18, 2025
94 శాతం మందికి ‘ఆత్మీయ భరోసా’ కట్: హరీశ్ రావు
TG: రాష్ట్రంలో 1.4 కోట్ల మంది ఉపాధి కూలీలుంటే 94 శాతం మందికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం చూస్తోందని BRS MLA హరీశ్ రావు ఆరోపించారు. దళితులు, గిరిజనుల, బీసీల నోళ్లు కొట్టడానికి చేతులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. 20 రోజులు పనిచేసేవారికి అని నిబంధనలు పెట్టడం, గుంట భూమి ఉన్నా అనర్హులుగా చేయడం సరికాదన్నారు. ప్రభుత్వ మోసంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.