News February 14, 2025
భారత్ది ఎప్పుడూ ‘శాంతి’ పక్షమే: మోదీ

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ తటస్థంగా ఉందని ప్రపంచం అనుకుంటోందని ప్రధాని మోదీ అన్నారు. కానీ భారత్ ఎప్పుడూ శాంతివైపే ఉంటుందని చెప్పారు. పుతిన్తో ట్రంప్ చర్చలు జరపడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. తనలాగే ట్రంప్కు కూడా దేశమే తొలి ప్రాధాన్యమని, ఇరుదేశాలు మరింత బలోపేతమై ఇంకా ఎత్తుకు ఎదగాలన్నదే తన ఆశ అని పేర్కొన్నారు.
Similar News
News December 9, 2025
TTD: మెరుగైన సేవలకు అభిప్రాయ సేకరణ

AP: మరింత మెరుగైన సేవల కోసం భక్తుల నుంచి TTD అభిప్రాయాలు సేకరిస్తోంది. IVRS ద్వారా వసతి, అన్నప్రసాదం సహా 17అంశాలపై సమాచారం తీసుకుంటోంది. తిరుమల, తిరుపతిలో పెట్టిన QR కోడ్లను స్కాన్ చేస్తే వచ్చే వాట్సాప్ నంబర్ 93993 99399లోనూ టెక్స్ట్/వీడియో ద్వారా భక్తుల నుంచి సమాచారం తెలుసుకుంటోంది. ప్రతినెల తొలి శుక్రవారం 0877-2263261 నుంచి డయల్ యువర్ EO ద్వారా సమస్యలు వింటూ సేవా నాణ్యత పెంచే ప్రయత్నం చేస్తోంది.
News December 9, 2025
‘అఖండ-2’ రిలీజ్తో 17 సినిమాలపై ఎఫెక్ట్!

బాలయ్య ‘అఖండ-2’ సినిమా ఈనెల 12న రిలీజ్కు సిద్ధమవుతోంది. దీంతో ఈ వారాంతంలో 14 కొత్త, 3 రీరిలీజ్ సినిమాల విడుదల ప్రశ్నార్థకంగా మారింది. ఇవి ఇప్పటికే ప్రమోషన్లు పూర్తిచేసుకున్నా.. బాక్సాఫీస్ వద్ద ‘అఖండ-2’ చూపించే ప్రభావం దృష్ట్యా విడుదలను పోస్ట్పోన్ చేసుకుంటున్నాయి. ‘మోగ్లీ’, ‘అన్నగారు వస్తారు’, ‘డ్రైవ్’ వంటి సినిమాల విడుదలకు బాలయ్య మూవీ పెద్ద సవాలుగా మారింది. దీనిపై మీ కామెంట్?
News December 9, 2025
సీఎం రేవంత్పై చిరంజీవి ప్రశంసలు

TG: అన్ని రంగాలను ఒకే వేదికపైకి తెచ్చి గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడం CM రేవంత్కే సాధ్యమైందని మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించారు. తెలంగాణ విజన్ డాక్యుమెంట్ విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇంత గొప్ప సభకు తననూ ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. సల్మాన్ ఖాన్ వంటి బాలీవుడ్ దిగ్గజాలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడం గొప్ప విషయమన్నారు. HYDను వరల్డ్ సినీ హబ్గా మార్చేందుకు ప్రయత్నిస్తామన్నారు.


