News April 11, 2025
ప్రపంచంలో అత్యధిక టీబీ కేసులు భారత్లోనే: పరిశోధకులు

ప్రపంచంలోనే అత్యధిక క్షయ కేసులు భారత్లోనే నమోదవుతున్నాయని పలువురు పరిశోధకులు తాజాగా ఆందోళన వ్యక్తం చేశారు. క్షయపై చర్చించేందుకు హైదరాబాద్లో ప్రారంభమైన సదస్సులో వారు మాట్లాడారు. ‘క్షయ కారణంగా 2023లో 3 లక్షలమందికి పైగా కన్నుమూశారు. ముందే గుర్తిస్తే టీబీ మరణాన్ని అరికట్టొచ్చు. భారత్కు సవాలుగా మారిన దీనిపై అందరూ కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు.
Similar News
News April 21, 2025
‘డ్రగ్స్ తీసుకున్నా’.. పోలీసు విచారణలో టామ్ చాకో!

మలయాళ నటుడు షైన్ టామ్ చాకో డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడని తెలుస్తోంది. ఇండస్ట్రీలో మేజర్ యాక్టర్లు కూడా మాదకద్రవ్యాలు వాడతారని చెప్పినట్లు సమాచారం. పోలీసుల సోదాలతో షూటింగ్ సమయంలో డ్రగ్స్ తీసుకోవడం కష్టంగా మారినట్లు చెప్పారని పలు జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. డ్రగ్స్ కొనేందుకు ఆన్లైన్లో డబ్బులు బదిలీ చేసేవాడినని, అయితే వారెవరనే విషయం తనకు తెలియదని చెప్పినట్లు పేర్కొన్నాయి.
News April 21, 2025
మా పిల్లలు ఆలయాన్ని ఎంతో ఇష్టపడ్డారు: జేడీ వాన్స్

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ రోజు కుటుంబంతో కలిసి ఢిల్లీలోని అక్షర్ధామ్ మందిరాన్ని సందర్శించారు. ‘ఈ అద్భుత ప్రదేశానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. ఈ ఆలయాన్ని ఇంత గొప్పగా నిర్మించిన ఘనత భారత్కు దక్కుతుంది. మా పిల్లలు దీన్ని ఎంతగానో ఇష్టపడ్డారు’ అని టెంపుల్ విజిటర్ బుక్లో వాన్స్ రాశారు. కాగా US ఉపాధ్యక్షుడు కుటుంబసమేతంగా 4 రోజులు భారత్లో పర్యటించనున్నారు.
News April 21, 2025
అభిషేక్ నాయర్కు థాంక్స్ చెప్పిన రోహిత్

నిన్న CSKతో మ్యాచులో అర్ధసెంచరీతో ముంబైకి విజయాన్ని అందించిన రోహిత్ శర్మ ఇన్స్టాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. తన ఫొటోను షేర్ చేస్తూ భారత మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్కు థాంక్స్ చెప్పారు. దీనిని అభిషేక్ షేర్ చేస్తూ ‘నథింగ్ బట్ లవ్’ అంటూ రీపోస్ట్ చేశారు. కాగా ఈ IPL సీజన్లో తొలుత విఫలమైన రోహిత్ తిరిగి గాడిన పడటంలో అభిషేక్ పాత్ర ఉందని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి.