News August 4, 2024
కష్టాల్లో భారత్.. ఒక్కడే 6 వికెట్లు తీశాడు!

శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ కష్టాల్లో పడింది. 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా 152కే 6 వికెట్లు కోల్పోయింది. భారత్ విజయానికి 25 ఓవర్లలో 89 రన్స్ అవసరం. రోహిత్ 64, గిల్ 35, విరాట్ 14, శ్రేయస్ అయ్యర్ 7 రన్స్ చేసి ఔటయ్యారు. దూబే, కేఎల్ రాహుల్ డకౌటయ్యారు. ప్రస్తుతం అక్షర్ (26*), సుందర్ (2*) క్రీజులో ఉన్నారు. శ్రీలంక బౌలర్ వండర్సే ఒక్కడే 6 వికెట్లు తీశారు.
Similar News
News December 16, 2025
‘అఖండ-2’లో బాలయ్య కూతురు ఎవరో తెలుసా?

‘అఖండ-2’లో బాలకృష్ణ కూతురిగా నటించిన హర్షాలీ మల్హోత్రా గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. సినిమాలో ఆమె ఐక్యూ 226, 17 ఏళ్లకే DRDO సైంటిస్ట్ అని చూపించడంతో మీమ్స్ వస్తున్నాయి. ముంబైలో పుట్టి పెరిగిన ఈ అమ్మాయి నాలుగేళ్లకే సీరియళ్లలో, ఏడేళ్ల వయసులో సల్మాన్ ఖాన్ ‘బజరంగీ భాయిజాన్’ మూవీలో నటించి మెప్పించారు. 2017 తర్వాత యాక్టింగ్ నుంచి బ్రేక్ తీసుకున్నారు. 8 ఏళ్ల తర్వాత ఈ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు.
News December 16, 2025
హాట్ మెటల్ ఉత్పత్తిలో వైజాగ్ స్టీల్ప్లాంట్ రికార్డ్

AP: విశాఖ స్టీల్ప్లాంట్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఆదివారం 6AM నుంచి సోమవారం 6AM వరకు బ్లాస్ట్ఫర్నేస్ 1, 2, 3 విభాగాల్లో 21,012 టన్నుల హాట్మెటల్ ఉత్పత్తి జరిగింది. ఒక రోజులో ఇప్పటి వరకు ఇదే అత్యధికం. ఈ ఏడాది NOV 30న 20,440 టన్నుల ఉత్పత్తి జరిగింది. సంస్థ అభివృద్ధి పట్ల తమకున్న నిబద్ధతకు ఇదే నిదర్శనమని ఉద్యోగ, కార్మిక వర్గాలు తెలిపాయి. ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశాయి.
News December 16, 2025
బాలికల స్కూల్ డ్రాపౌట్స్.. UPలో ఎక్కువ, TGలో తక్కువ!

దేశంలో బాలికల స్కూల్ డ్రాపౌట్స్ రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రం UP(57%) అని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించింది. అత్యల్పంగా తెలంగాణలో 31.1% డ్రాపౌట్స్ అయినట్లు తెలిపింది. దేశ వ్యాప్తంగా గత నాలుగేళ్లలో 84.9 లక్షల మంది చదువును మధ్యలోనే ఆపేశారని, అందులో సగం కంటే ఎక్కువ బాలికలే ఉన్నారని పేర్కొంది. ఐదేళ్లలో 26.46 లక్షల మందిని తిరిగి స్కూళ్లలో చేర్పించినట్లు ప్రకటించింది.


