News August 4, 2024

కష్టాల్లో భారత్.. ఒక్కడే 6 వికెట్లు తీశాడు!

image

శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ కష్టాల్లో పడింది. 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా 152కే 6 వికెట్లు కోల్పోయింది. భారత్ విజయానికి 25 ఓవర్లలో 89 రన్స్ అవసరం. రోహిత్ 64, గిల్ 35, విరాట్ 14, శ్రేయస్ అయ్యర్ 7 రన్స్ చేసి ఔటయ్యారు. దూబే, కేఎల్ రాహుల్ డకౌటయ్యారు. ప్రస్తుతం అక్షర్ (26*), సుందర్ (2*) క్రీజులో ఉన్నారు. శ్రీలంక బౌలర్ వండర్సే ఒక్కడే 6 వికెట్లు తీశారు.

Similar News

News November 17, 2025

కొత్తగూడెంలో జాబ్ మేళా.. 2915 మందికి ఉద్యోగాలు

image

కొత్తగూడెం క్లబ్‌లో ఆదివారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు 8500 మంది నిరుద్యోగులు హాజరయ్యారు. కాగా 2915 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. 65 కంపెనీలకు పైగా ఈ జాబ్ మేళాకు హాజరై నిరుద్యోగ అభ్యర్థుల దరఖాస్తులను స్వీకరించి ఇంటర్వ్యూ నిర్వహించారు. అర్హత సాధించిన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కూనంనేని, సీఎండీ బలరాం, కలెక్టర్, ఎస్పీ పాల్గొన్నారు.

News November 17, 2025

సౌదీలో ఘోర ప్రమాదం.. 42 మంది మృతి

image

సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్కాలో ప్రార్థనలు ముగించుకుని మదీనాకు వెళ్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగి 42 మంది యాత్రికులు సజీవదహనమయ్యారు. ఇందులో 20 మంది మహిళలు, 11 మంది పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులు ఉన్నట్లు నేషనల్ మీడియా తెలిపింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ముఫరహత్ వద్ద ఈ యాక్సిడెంట్ జరిగింది.

News November 17, 2025

ఏపీ న్యూస్ రౌండప్

image

* కడప జిల్లాలోని పుష్పగిరిలో 13వ శతాబ్దానికి చెందిన శాసనాలను పురావస్తు శాఖ గుర్తించింది.
* కల్తీ నెయ్యి కేసులో నిందితుడైన A24 చిన్న అప్పన్నను నేటి నుంచి 5 రోజులపాటు సిట్ విచారించనుంది. ఇదే కేసులో TTD మాజీ ఛైర్మన్ YV సుబ్బారెడ్డి ఈ నెల 19/20న విచారణకు హాజరుకానున్నారు.
* TTD మాజీ ఏవీఎస్‌వో సతీశ్ మృతి కేసును గుత్తి రైల్వే పోలీసుల నుంచి తాడిపత్రి పోలీసులకు బదిలీ చేయాలని అధికారులు నిర్ణయించారు.