News August 4, 2024
కష్టాల్లో భారత్.. ఒక్కడే 6 వికెట్లు తీశాడు!

శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ కష్టాల్లో పడింది. 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా 152కే 6 వికెట్లు కోల్పోయింది. భారత్ విజయానికి 25 ఓవర్లలో 89 రన్స్ అవసరం. రోహిత్ 64, గిల్ 35, విరాట్ 14, శ్రేయస్ అయ్యర్ 7 రన్స్ చేసి ఔటయ్యారు. దూబే, కేఎల్ రాహుల్ డకౌటయ్యారు. ప్రస్తుతం అక్షర్ (26*), సుందర్ (2*) క్రీజులో ఉన్నారు. శ్రీలంక బౌలర్ వండర్సే ఒక్కడే 6 వికెట్లు తీశారు.
Similar News
News December 8, 2025
ఇండిగో అంశం కేంద్రం పరిధిలోనిది: చంద్రబాబు

AP: ఇండిగో సంక్షోభాన్ని తాము పర్యవేక్షించడం లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, సాధ్యమైనంత వరకు సమస్యను పరిష్కరిస్తుందన్నారు. కేంద్రమంత్రి భారత ప్రభుత్వానికి జవాబుదారీ అని చంద్రబాబు తెలిపారు. కాగా ఇండిగో సంక్షోభాన్ని మంత్రి లోకేశ్ మానిటర్ చేస్తున్నారని ఇటీవల ఓ టీవీ డిబేట్లో టీడీపీ MLC దీపక్ రెడ్డి చేసిన కామెంట్స్పై విమర్శలు వ్యక్తమయ్యాయి.
News December 8, 2025
10ఏళ్లలో రూ.కోటి విలువ రూ.55లక్షలే!

మీరు దాచుకున్న డబ్బు విలువ కాలక్రమేణా ద్రవ్యోల్బణం కారణంగా తగ్గిపోతుందనే విషయం మీకు తెలుసా? మీ దగ్గర రూ.కోటి ఉంటే ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణం(6%) కొనసాగితే మరో పదేళ్లలో అది ₹55.8 లక్షలకు చేరనుంది. 2045లో రూ.31.18లక్షలు, 2075నాటికి ₹కోటి విలువ రూ.5.4లక్షలకు పడిపోనుంది. అందుకే డబ్బును పొదుపు చేయడంతో పాటు సంపద విలువను కాపాడుకోవడానికి పెట్టుబడి పెట్టడం అలవర్చుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
News December 8, 2025
కేంద్ర ఉద్యోగులకు వేతన సవరణ ఆలస్యమేనా!

7వ PRC గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. 2026 JAN నుంచి 8వ PRC అమలు కావాలి. ఈ కమిషన్ను కేంద్రం ఈ ఏడాది JANలో వేసినా టర్మ్స్ను NOVలో కానీ ప్రకటించలేదు. కాగా PRCపై LSలో MPలు ప్రశ్నించగా ‘ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఎప్పటినుంచి అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. కమిషన్ నివేదికకు 18 నెలల సమయం పడుతుంది’ అని మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. దీంతో కేంద్ర ఉద్యోగులు ఎదురుచూస్తున్న PRC అమలు ఆలస్యం కావొచ్చంటున్నారు.


