News March 18, 2024

మోదీతోనే భారత్ సురక్షితం: అర్వింద్

image

ప్రధాని నరేంద్ర మోదీతోనే భారత్ సురక్షితంగా ఉంటుందని, నరేంద్ర మోదీని మూడవసారి ప్రధానిగా గెలిపించాలని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. జగిత్యాలలో సోమవారం విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడారు. సైనికుడు అభినందన్ ను పాకిస్థాన్ చెర నుండి విడిపించిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీ దన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో బిజెపి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Similar News

News August 16, 2025

ALERT.. గోదావరి పరీవాహక ప్రజలకు హెచ్చరిక

image

కురుస్తున్న వర్షాలతో గోదావరి నదిలో భారీగా వరద నీరు పెరిగే అవకాశం ఉన్నందున గోదావరి నదీ పరిసర ప్రాంతాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోచంపాడ్ డ్యామ్ సైట్ EE M.చక్రపాణి హెచ్చరించారు. పశువుల కాపర్లు, గొర్ల కాపరులు, చేపలు పట్టేవారు, రైతులు, సామాన్య ప్రజలు గోదావరి నదిని దాటే ప్రయత్నాలు చేయవద్దని ఆయన సూచించారు.

News August 15, 2025

NZB: దారుణం.. కన్న కూతురిపైనే అత్యాచారాయత్నం

image

నవీపేట్ మండలంలో దారుణం జరిగింది. ఓ గ్రామానికి చెందిన వ్యక్తి కన్నకూతురి పైనే లైంగిక దాడికి యత్నించాడు. గ్రామస్థుల కథనం ప్రకారం.. మద్యానికి బానిసైన అతడు కొంతకాలంగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో 11 ఏళ్ల కూతురికి ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూపుతూ అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఈ విషయాన్ని ఇటీవల తల్లి దృష్టికి తీసుకెళ్లగా బంధువులకు చెప్పి పంచాయతీ పెట్టారు. విషయం నిన్న పోలీసులకు చేరగా వారు దర్యాప్తు చేస్తున్నారు.

News August 15, 2025

WOW.. మువ్వన్నెల రంగుల్లో మెరిసిన SRSP

image

79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు నిజామాబాద్ జిల్లాలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా శ్రీరాం సాగర్ ప్రాజెక్టు మూడు రంగుల్లో మెరిసిపోతోంది. ప్రాజెక్టును అధికారులు త్రివర్ణ పతాకం రంగుల్లో అలరారేలా చేయగా ప్రజలు దానిని చూసేందుకు బారులు తీరారు. చూసేందుకు కన్నుల పండువగా ఉండగా నిత్యం ఇలా లైటింగ్‌తో ఉంచితే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు.