News September 22, 2024

2025 క్వాడ్ సమ్మిట్‌ ఆతిథ్యానికి భారత్ సిద్ధం: మోదీ

image

క్వాడ్ సమ్మిట్‌-2025కు ఆతిథ్యమిచ్చేందుకు భారత్ సిద్ధమని PM మోదీ అన్నారు. విల్మింగ్టన్‌ క్వాడ్ సమ్మిట్‌లో విదేశీ అధినేతలతో కలిసి పాల్గొన్నారు. 2021 నుంచి క్వాడ్ ఎంతో పురోగతిని సాధించిందని, ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో క్వాడ్ అవసరం ఎంతో ఉందన్నారు. ప్రజాస్వామ్య విలువల ప్రాతిపదికన దేశాలు కలిసి పనిచేయడం మానవాళికి ఎంతో ముఖ్యమన్నారు. కాగా క్వాడ్‌లో ఇండియా, US, జపాన్, ఆస్ట్రేలియా సభ్యదేశాలుగా ఉన్నాయి.

Similar News

News November 24, 2025

ప్రజల నుంచి 450 అర్జీల స్వీకరణ: అనంత కలెక్టర్

image

అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ సోమవారం కలెక్టరేట్‌లోని PGRS కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలనుంచి 450 అర్జీలను స్వీకరించామని తెలిపారు. PGRS అర్జీలను నాణ్యతగా పరిశీలించాలని సంబంధిత అధికారులకు సూచించారు. స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులతో విచారణ జరిపి త్వరగా పరిష్కరిస్తామని అన్నారు.

News November 24, 2025

ఐబొమ్మ రవి సంపాదన రూ.100 కోట్లు?

image

మూవీల పైరసీ, బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌తో ఐబొమ్మ <<18377140>>రవి<<>> రూ.100 కోట్లకు పైగా సంపాదించాడని పోలీసులు విచారణలో గుర్తించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రూ.30 కోట్లకు పైగా బ్యాంకు ట్రాన్సాక్షన్స్‌ను సేకరించినట్లు సమాచారం. మూవీపై క్లిక్ చేయగానే 15 యాడ్స్‌కు లింక్ అయ్యేలా వెబ్‌సైట్‌లో ఏర్పాటు చేశాడని గుర్తించారు. మరోవైపు ఈ విచారణపై రేపు ప్రెస్‌మీట్‌లో సజ్జనార్ వివరాలను వెల్లడిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

News November 24, 2025

అక్రమ మైనింగ్.. ఎమ్మెల్యే సోదరుడి ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

image

TG: పటాన్‌చెరు MLA మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్‌కు చెందిన సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ కంపెనీ అక్రమ మైనింగ్ చేసిందని ఈడీ గుర్తించింది. అనుమతి లేకుండా, పరిమితికి మించి మైనింగ్ చేస్తూ రూ.300 కోట్లకుపైగా అక్రమాలకు పాల్పడినట్లు పేర్కొంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.39Cr రాయల్టీ చెల్లించలేదని తెలిపింది. ఈ మేరకు మధుసూదన్‌కు చెందిన రూ.80 కోట్లు అటాచ్ చేసినట్లు ప్రకటనలో వెల్లడించింది.