News January 14, 2025

కొత్త రైలు ఇంజిన్‌తో ప్రపంచాన్ని స్టన్‌చేసిన భారత్!

image

భారత్ మరో అద్భుతం చేసింది. US సహా ప్రపంచాన్ని స్టన్‌ చేసింది. తొలిసారిగా 1200 హార్స్‌పవర్‌తో నడిచే హైడ్రోజన్ రైల్ ఇంజిన్‌ను అభివృద్ధి చేసింది. మరికొన్ని రోజుల్లోనే ట్రయల్ రన్ చేపట్టనుంది. ఇప్పటి వరకు అమెరికా, చైనా, జర్మనీలోనే ఇలాంటి రైలు ఇంజిన్లు ఉన్నాయి. వాటి సామర్థ్యమూ 500-600HPS మధ్యే ఉంటుంది. భారత్ మాత్రం 1200HPS, 140KMSతో అబ్బురపరిచింది. వీటికి డీజిల్, కరెంటు అవసరం లేదు. కాలుష్యం వెలువడదు.

Similar News

News December 4, 2025

టైర్లు ధ్వంసమైనా, నీటిలోనూ ప్రయాణం ఆగదు

image

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌ <<18465862>>పర్యటన<<>> వేళ ఆయన ప్రయాణించే “ఆరస్ సెనాట్” కారుపై చర్చ జరుగుతోంది. ఇది ప్రపంచంలో అత్యంత సురక్షిత వాహనాల్లో ఒకటి. ఆధునిక సాంకేతికతతో రూపొందించిన ఈ కారు బాంబులు, క్షిపణి దాడులను సైతం తట్టుకుంటుంది. నీటిలో మునిగిపోయినా ఇది తేలి సురక్షిత ప్రాంతానికి చేర్చుతుంది. ప్రత్యేకంగా కస్టమైస్డ్‌ అయిన ఈ కారు ధర సుమారు రూ.5కోట్లు ఉంటుంది. ఇది సాధారణ పౌరులకు అందుబాటులో లేదు.

News December 4, 2025

వస్తువు కొనేముందు ఓ సారి ఆలోచించండి: హర్ష

image

అవసరమైన వస్తువులను మాత్రమే కలిగి ఉండే జీవనశైలిని అలవరుచుకోవాలని పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా యువతకు సూచించారు. ‘మెరుగైన లైఫ్‌స్టైల్ కోసం ప్రయత్నిస్తూ చాలా మంది తమ మనశ్శాంతిని కోల్పోతున్నారు. విలాసంగా జీవించడం అంటే ఎక్కువ వస్తువులను కొనడం కాదు. తక్కువ వస్తువులు ఉంటే వాటి నిర్వహణ, శ్రమ కూడా తగ్గుతుంది’ అని అభిప్రాయపడ్డారు. అందుకే వస్తువులను కొనేముందు అవి నిజంగా అవసరమా అని ఆలోచించండి. SHARE IT

News December 4, 2025

ఆఫర్లను రద్దు చేసిన 20 సంస్థలపై IITల బ్యాన్

image

జాబ్ ఆఫర్ ఇచ్చి ఆపై రద్దు చేసిన 20కి పైగా సంస్థలను ప్లేస్‌మెంట్ల డ్రైవ్ నుంచి IITలు నిషేధించాయి. ఆ కంపెనీల చర్య విద్యార్థుల కెరీర్ ప్లానింగ్‌కు ఆటంకం కలిగించడంతో పాటు ఒత్తిడికి గురిచేయడమే దీనికి కారణం. ఇందులో డేటా అనలటిక్స్ కంపెనీలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని ఆఫర్ లెటర్లో ఇచ్చిన ప్యాకేజీని జాయినింగ్‌కు ముందు తగ్గించాయి. కంపెనీల ప్లేస్‌మెంట్ల హిస్టరీని పరిశీలిస్తున్నట్లు IIT ప్రొఫెసర్ ఒకరు తెలిపారు.